
భారీ వర్షానికి కొట్టుకుపోయిన వంతెన
రాయచూరురూరల్: జిల్లాలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. రెండు గంటలపాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి గ్రామీణ ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. వంకలు, వాగులు పొంగి ప్రవహించాయి. వరద నీటి ఉధృతికి తాలుకాలోని పత్తేపూర్లో పాత వంతెన కొట్టుకుపోయింది. వరద నీటిలో టిప్పర్ చిక్కుకుపోయింది. డ్రైవర్ ప్రాణాలతో బయట పడ్డాడు. కాగా పాత వంతెన పక్కనే కొత్తగా వంతెన నిర్మిస్తున్నారు. పనులు మందకొడిగా సాగుతుండటంతో ప్రజలు పాత వంతెనపైనే రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం అంది కూడా కొట్టుకుపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.