స్నేహితుడి చేతిలో వ్యక్తి హత్య | - | Sakshi
Sakshi News home page

స్నేహితుడి చేతిలో వ్యక్తి హత్య

Jun 9 2025 7:43 AM | Updated on Jun 9 2025 7:43 AM

స్నేహ

స్నేహితుడి చేతిలో వ్యక్తి హత్య

రాయచూరు రూరల్‌: చిన్ననాటి స్నేహితుడిని పొలానికి తీసుకెళ్లి హతమార్చిన ఉదంతం లింగసూగురు తాలూకా యరగుంటలో చోటు చేసుకుంది. జిల్లా ఎస్పీ పుట్టమాదయ్య తెలిపిన మేరకు వివరాలు.. గ్రామానికి చెందిన శరణే గౌడ, బసన గౌడ(43)లు చిన్ననాటి స్నేహితులు. ఏ కారణం చేతనో శనివారం బసనగౌడను పొలానికి తీసుకెళ్లి హత్య చేశాడు. రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్న బసనగౌడను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు డాగ్‌స్క్వాడ్‌ సహాయంతో నిందితుడిని గుర్తుంచి అరెస్ట్‌ చేశారు.

బైక్‌ను ట్రాక్టర్‌ ఢీ, ముగ్గురికి గాయాలు

బొమ్మనహాళ్‌: మండలంలోని ఎల్‌బీ నగర్‌ గ్రామం వద్ద ట్రాక్టర్‌ ఢీకొని ముగ్గురికి గాయాలైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. బళ్లారికి చెందిన బాషా అనే వ్యక్తి ద్విచక్ర వాహనంలో భార్య, కూతురితో కలిసి కణేకల్లుకు వస్తున్నాడు. యర్రగుంట గ్రామానికి చెందిన ట్రాక్టర్‌ రాళ్లు లోడుతో యర్రగుంట వైపు వస్తూ వెనుక వైపు నుంచి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనం కింద పడిపోగా బాషా కుటుంబీకులు తీవ్రంగా గాయపడ్డారు. స్ధానికులు వెంటనే ప్రైవేట్‌ అంబులెన్సులో బళ్లారిలోని విమ్స్‌కు తరలించారు. బొమ్మనహాళ్‌ పోలీసులు సంఘటన స్ధలానికి చేరుకొని పరిశీలించారు.

హవేరి జిల్లాలో రెచ్చిపోయిన మృగాళ్లు

బాలికపై వరుసగా లైంగిక దాడులు

నలుగురి అరెస్ట్‌

హుబ్లీ: హావేరి జిల్లాలో మృగాళ్లు రెచ్చిపోయారు. సిగ్గావి తాలూకా ముగళిగట్టి గ్రామంలో బాలికపై వరుస దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ఆ గ్రామానికి చెందిన గొణిరుద్ర సిగ్గట్టి ప్రేమపేరుతో బాలికను మభ్య పెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన హేమంత కబసూర, మంజునాథ్‌లు బాలిను బెదిరించి అడవి ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం బయటకు పొక్కడంతో పెద్దలు లక్ష్మణ, మారుతీలు రాజీ పంచాయితీ చేసేందుకు బాలిక తండ్రిపై ఒత్తిడి చేశారు. అయితే బాలిక తల్లి ససేమిరా అంది. అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ లింగరాజ నేతృత్వంలోని పోలీసులు గాలింపు చేపట్టి గొణిరుద్ర సిగ్గట్టి, మంజనాథ, లక్ష్మణ, మారుతీలను అరెస్ట్‌ చేశారు. హేమంత్‌ కబసూరు పరారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

11న జైన సాధు, సాద్విక్‌ శిబిరలు

రాయచూరురూరల్‌: జైన ధర్మం ప్రచారంలో భాగంగా ఈనెల 11న నగరంలో జైన్‌ సాదు, సాద్విక్‌ దీక్ష శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆ ధర్మానికి చెందిన డాక్టర్‌ శుత నిధిజి తెలిపారు. అదివారం వర్దమాన స్థానకవాసి జైన్‌ శ్రావక సంఘ్‌ భవనంలో మాట్లాడుతూ అచార్య భగవంత 1008 పార్వ్శ చంద్రా ఆధ్వర్యంలో ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయని, ఈ సందర్భంగా దిలిప్‌కుమార్‌ దోఖాకు జైన దీక్ష ఇవ్వనున్నట్లు తెలిపారు. శాంతిలాల్‌, విశ్వ కుమార్‌, ప్రసన్న చంద్‌, నరేంద్ర, గౌతంఘియా, అశోక్‌ కుమార్‌జైన్‌ పాల్గొన్నారు.

ఆవుల బెడద అరికట్టండి

హొసపేటె: నగరంలో ఆవుల బెడద తీవ్రంగా మారింది. మందలుగా సంచరిస్తూ వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. రోడ్లకు అడ్డంగా పడుకుంటున్నాయి. వాటిని దాటుకొని వెళ్లేందుకు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆవుల వల్ల ప్రమాదాలు జరిగి ద్విచక్రవాహనదారులు గాయపడిన ఘటనలు అనేకం ఉన్నాయి. వీధి పశువుల బెడద నివారణకు సంబంధించి గతంలో జిల్లా కలెక్టర్‌ ఎస్‌ఎస్‌ దివాకర్‌, నగరసభ అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే మళ్లీ ఆవుల బెడద మొదలైంది. నగరసభ అధికారులు స్పందించి పశువులు రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.

స్నేహితుడి చేతిలో వ్యక్తి హత్య 1
1/5

స్నేహితుడి చేతిలో వ్యక్తి హత్య

స్నేహితుడి చేతిలో వ్యక్తి హత్య 2
2/5

స్నేహితుడి చేతిలో వ్యక్తి హత్య

స్నేహితుడి చేతిలో వ్యక్తి హత్య 3
3/5

స్నేహితుడి చేతిలో వ్యక్తి హత్య

స్నేహితుడి చేతిలో వ్యక్తి హత్య 4
4/5

స్నేహితుడి చేతిలో వ్యక్తి హత్య

స్నేహితుడి చేతిలో వ్యక్తి హత్య 5
5/5

స్నేహితుడి చేతిలో వ్యక్తి హత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement