పార్టీని మరింత బలోపేతం చేద్దాం | - | Sakshi
Sakshi News home page

పార్టీని మరింత బలోపేతం చేద్దాం

Jun 3 2025 12:22 AM | Updated on Jun 3 2025 12:22 AM

పార్ట

పార్టీని మరింత బలోపేతం చేద్దాం

రాయచూరు రూరల్‌: జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేద్దామని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు బసవరాజ్‌ పాటిల్‌ ఇటగి పేర్కొన్నారు. సోమవారం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జిల్లా మహిళా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలుగా నిర్మల బెణ్ణె అధికార బాధ్యతలు స్వీకరించే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రజలు బీజేపీ పట్ల విసుగు చెందారన్నారు. అక్రమాల పుట్ట, కమీషన్‌ పేరుతో రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేశారన్నారు. రారష్ట్‌రంలో కాంగ్రెస్‌ సర్కార్‌ జారీ చేసిన పంచ గ్యారెంటీలు త్వరలో జరుగనున్న నగరసభ, జెడ్పీ, టీపీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి సహాయకారి అవుతాయన్నారు. సమావేశంలో శాంతప్ప, నరసమ్మ, శాలం, అమరేగౌడ, శ్రీనివాసరెడ్డి, తాయన్న, శివమూర్తి, అరుణ్‌, రాజశేఖర్‌, నాగేంద్రలున్నారు.

ట్రాక్టర్‌ టిల్లర్‌ కింద

పడి వ్యక్తి మృతి

హుబ్లీ: ధార్వాడ తాలూకా ఎత్తినగుడ్డ వద్ద పొలంలో ట్రాక్టర్‌ టిల్లర్‌(నాగలి) కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన జరిగింది. ఆ గ్రామానికి చెందిన నారాయణ ఈళిగేర మృతుడు. పరిచయం ఉన్న వ్యక్తి రుద్రగౌడ పాటిల్‌తో కలిసి ఈయన ట్రాక్టర్‌తో నాగలి దున్నించడానికి వెళ్లారు. ఈ క్రమంలో ఆకస్మికంగా నాగలి కింద పడి మృతి చెందాడు. అయితే ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చేశాడు. అయితే పొలంలో వ్యక్తి మృతదేహం లభించగా తొలుత హత్యగా అనుమానం వ్యక్తమైంది. పోలీసులు విచారించగా నాగలి దున్నేటప్పుడు పొరపాటున నారాయణ పడి మృతి చెందినట్లు తేలింది. ఈ కేసుకు సంబంధించి డ్రైవర్‌ రుద్రగౌడ పాటిల్‌ను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేపట్టినట్లు ధార్వాడ ఉపనగర పోలీసులు తెలిపారు.

పాల ప్రాముఖ్యతపై

అవగాహన అవసరం

రాయచూరు రూరల్‌: పాల వాడకం ప్రాముఖ్యతపై అవగాహన అవసరమని బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం సంచాలకురాలు స్మిత పేర్కొన్నారు. నగరంలోని బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయంలో ప్రపంచ క్షీర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించి ఆమె మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పాలను తాగాలని, పాలతో తయారు చేసిన ఆహార పదార్థాలను తినాలన్నారు. తద్వారా పాల వాడకం కూడా పెరిగి ఆరోగ్యం పెంపొందుతుందన్నారు.

చెరువులోకి ట్రాక్టర్‌ బోల్తా.. బాలుడు దుర్మరణం

రాయచూరు రూరల్‌: చెరువులోకి ట్రాక్టర్‌ బోల్తా పడ్డ ఘటనలో అమరేష్‌(15) అనే బాలుడు దుర్మరణం చెందిన ఘటన జిల్లాలోని లింగసూగూరు తాలూకాలో చోటు చేసుకుంది. ఆదివారం కరడకల్‌ చెరువు గట్టుపై ట్రాక్టర్‌ నడుపుతుండగా డ్రైవర నిర్లక్ష్యంతో ట్రాక్టర్‌ అదుపు తప్పి చెరువులోకి పడింది. డ్రైవర్‌ నీటిలో మునిగి ఈత కొడుతూ బయట పడ్డాడు. కానీ బాలుడు చెరువులో మునిగి ప్రాణాలు వదిలాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ దత్తాత్రేయ కర్నాడ్‌ తెలిపారు.

పిల్లలకు కిట్ల పంపిణీ

రాయచూరు రూరల్‌: సమాజంలో ప్రామాణికతో పేద పిల్లలకు సహాయం చేయడం మానవ ధర్మమని రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు శరణ బసవ పేర్కొన్నారు. ఆదివారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందింరలో కలా సంకుల సంస్థ ఆధ్వర్యంలో పేద పిల్లలకు స్కూల్‌ బ్యాగ్‌ కిట్లను అందించి మాట్లాడారు. విద్యారంగంలో జిల్లా వెనుక బడిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రాథమిక స్థాయిలో పిల్లలకు విద్యను అందించాలన్నారు. కార్యక్రమంలో కలా సంకుల సంస్థ అధ్యక్షురాలు రేఖ, ఇన్‌కంటాక్స్‌ అధికారి శోభా యాదవ్‌, సురేఖ, ప్రసన్న, ఫాతిమా, దండెప్ప, శ్రీనివాస్‌, మంజుల, సంతోషి, మారుతిలున్నారు.

పార్టీని మరింత  బలోపేతం చేద్దాం 1
1/3

పార్టీని మరింత బలోపేతం చేద్దాం

పార్టీని మరింత  బలోపేతం చేద్దాం 2
2/3

పార్టీని మరింత బలోపేతం చేద్దాం

పార్టీని మరింత  బలోపేతం చేద్దాం 3
3/3

పార్టీని మరింత బలోపేతం చేద్దాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement