సరళంగా మారెమ్మ దేవి ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

సరళంగా మారెమ్మ దేవి ఉత్సవాలు

Jun 6 2025 1:13 AM | Updated on Jun 6 2025 1:13 AM

సరళంగ

సరళంగా మారెమ్మ దేవి ఉత్సవాలు

రాయచూరు రూరల్‌ : నగరంలో సరళంగా మారెమ్మ దేవి ఉత్సవాలు నిర్వహించారు. మంగళవారం సాయంత్రం నగరంలోని కంచు గడ్డ మారెమ్మ ఆలయంలో పుష్పాలంకరణ చేశారు. భక్తులు దేవి ఆలయంలో విశేష పూజలు నెరవేర్చారు. భక్తులు తెల్లవారు జామున అమ్మవారికి ఊయల సేవను చేపట్టారు.

లోకాయుక్త వలలో సర్వేయర్‌

రాయచూరు రూరల్‌: యాదగిరి జిల్లా సురపురలో ఓ సర్వేయర్‌ లోకాయుక్త వలలో చిక్కారు. ఫారం నంబర్‌– 10 ఇవ్వడానికి సర్వేయర్‌ మల్లికార్జున లంచం డిమాండ్‌ చేయడంతో న్యాయవాది సోమనాథ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు లోకాయుక్త అధికారులు దాడి చేశారు. సురపుర తాలూకా సర్వే కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మల్లికార్జున భూమిని కొలత చేయడానికి రూ.20 వేలను లంచం అడిగారు. రూ.19 వేలను ఫోన్‌ పే ద్వారా లంచంగా తీసుకున్నారు. దీని ఆధారంగా పోలీస్‌ కస్టడీలో ఉంచామని డీఎస్పీ ఇనాందార్‌ వెల్లడించారు.

కృష్ణరాజ ఒడెయర్‌కు పుష్పాంజలి

రాయచూరు రూరల్‌: నగరంలో మైసూరు రాజవంశస్థుడు కృష్ణరాజ ఒడెయర్‌ 141వ జయంతిని ఆచరించారు. కన్నడ భవనంలో కన్నడ సాహిత్య పరిషత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తాలూకా అధ్యక్షుడు వెంకటేష్‌, రావుత్‌ రావ్‌లు పుష్పాంజలి ఘటించి మాట్లాడారు. కన్నడ భాషకు కృష్ణరాజ ఒడెయర్‌ చేసిన సేవలను కొనియాడారు. సమావేశంలో విద్యాసాగర్‌, శ్రీనివాస్‌ రాయచూరకర్‌, దండెప్ప, బాబు భండారిగళ్‌, వీర హనుమాన్‌, పాటిల్‌ తదితరులు పాల్గొన్నారు.

తాగునీటి ఎద్దడి నివారించండి

రాయచూరు రూరల్‌: జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణ, పర్యావరణ సంరక్షణకు అధికారులు నడుం బిగించాలని జెడ్పీ సీఈఓ రాహుల్‌ తుకారాం పాండే పేర్కొన్నారు. జిల్లా పంచాయతీ కార్యాలయంలో పీడీఓ, గ్రామ అభివృద్ధి అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాకాలంలో చేపట్టాల్సిన నరేగ పనులపై పంచాయతీ అభివృద్ధి అధికారులతో చర్చించారు. గ్రామాల్లో ఇంటి పన్ను, ఆస్తి పన్నును వసూలు చేయాలని సూచించారు. సమావేశంలో అధికారులు శరణబసవ, చంద్రశేఖర్‌లున్నారు.

కాంగ్రెస్‌ ఆఫీసులుగా

పోలీస్‌ స్టేషన్లు

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పోలీస్‌ స్టేషన్లను తమ పార్టీ కార్యాలయాలుగా మార్చుకున్నారని బీజేపీ జిల్లాధ్యక్షుడు వీరనగౌడ ఆరోపించారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కలబుర్గిలో విధాన పరిషత్‌ సభ్యులు హరీష్‌ పూంజా, నారాయణ స్వామి, రవి కుమార్‌లపై అక్రమంగా కేసులు నమోదు చేయించారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు నశించి పోయాయన్నారు. రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర్‌ను ముఖ్యమంత్రి సిద్దరామయ్య కీలుబొమ్మగా చేశారన్నారు. పాకిస్తాన్‌ జిందాబాద్‌, నాసిర్‌ సాబ్‌ జిందాబాద్‌ అన్న వారిని సమర్థించడాన్ని తప్పుబట్టారు. కలబుర్గిలో ప్రియాంక్‌ ఖర్గే, దక్షిణ కన్నడలో యూటీ ఖాదర్‌, హుబ్లీ ధార్వాడలో సంతోష్‌లాడ్‌, బెళగావిలో లక్ష్మీ హెబ్బాళ్కర్‌, శివమొగ్గలో మధు బంగారప్ప రిపబ్లిక్‌ ఆఫ్‌ జిల్లాగా నడుపుతున్నారని వెల్లడించారు. విలేకరుల సమావేశంలో శంకర్‌రెడ్డి, మల్లికార్జున, రాము, రవీంద్ర జాలదార్‌ పాల్గొన్నారు.

సరళంగా మారెమ్మ దేవి ఉత్సవాలు 1
1/3

సరళంగా మారెమ్మ దేవి ఉత్సవాలు

సరళంగా మారెమ్మ దేవి ఉత్సవాలు 2
2/3

సరళంగా మారెమ్మ దేవి ఉత్సవాలు

సరళంగా మారెమ్మ దేవి ఉత్సవాలు 3
3/3

సరళంగా మారెమ్మ దేవి ఉత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement