
ఇందిరా క్యాంటీన్ ప్రారంభం
హొసపేటె: విజయనగర జిల్లా కొట్టూరు పట్టణంలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆవరణలో రిబ్బన్ కట్ చేసి ఇందిరా క్యాంటీన్ను ఎంపీ ఈ.తుకారాం, హగరిబొమ్మనహళ్లి ఎమ్మెల్యే నేమిరాజ్ నాయక్, పట్టణ పంచాయతీ అధ్యక్షురాలు బీ.రేఖా రమేష్, ఉపాధ్యక్షుడు సిద్ధయ్య ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని ప్రవాసి మందిరంలో ఎంపీ మీడియాతో మాట్లాడుతూ ఇందిరా క్యాంటీన్ ఏర్పాటుతో ఆస్పత్రికి వచ్చే రోగులకు, కార్మికులకు, పేదలకు ఎంతో అనుకూలం అవుతుందన్నారు. అయితే కొట్టూరులో ఉన్న ప్రస్తుత సమస్యల గురించి విలేకరులు అడగగా ఇక్కడ నెలకొన్న సమస్యలను రాబోయే రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులు దొడ్డ రామణ్ణ, ఎంఎంజీ సత్యప్రకాష్, బీడీసీసీ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ ద్వారకేష్, పట్టణ పంచాయతీ చీఫ్ నసరుల్లా, అడికె మంజునాథ్, ఇంజినీర్ అశోక్, డీఎస్ఎస్ జిల్లా కో–ఆర్డినేటర్ బీ.మరిస్వామి, పట్టణ పంచాయతీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.