
ఔషధ దుకాణాల్లో మత్తు పదార్థాలు అమ్మొద్దు
రాయచూరు రూరల్: జిల్లాలో మత్తు పదార్థాలను మందుల దుకాణాల్లో విక్రయించరాదని, మత్తు పదార్థాల నియంత్రణకు సహకరించాలని సదర్ బజార్ పోలీస్ స్టేషన్ సీఐ ఉమేష్ నారాయణ కాంబ్లే పేర్కొన్నారు. మంగళవారం రాత్రి నగరంలోని సదర్ బజార్ పోలీస్ స్టేషన్లో మందుల దుకాణాల వ్యాపారులకు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. యువకులు మత్తు పదార్థాలకు అలవాటు పడరాదన్నారు. రోగులకు ఔషధాలు ఇచ్చే ముందు వైద్యుల ప్రిస్క్రిప్షన్ ఉన్న వారికి మాత్రమే అవకాశం కల్పించాలన్నారు. మత్తు పదార్థాల సేవనంతో అనారోగ్యానికి తోడు మానసికంగా కుంగిపోతారన్నారు.