
గురువుల ఉపదేశం బంగారం
చింతామణి: తాలూకాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమయిన కై వార శ్రీ యోగినారేయణ స్వామి ఆలయంలో కాలజ్ఞాని శ్రీ యోగి నారేయణ తాతయ్య 190వ జీవ సమాధి ప్రవేశ పర్వ ఆరాధన ఉత్సవాలు గురువారం ఘనంగా ఆరంభమయ్యాయి. తాతయ్య విగ్రహానికి అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేసిన ధర్మాధికారి జయరాం మాట్లాడుతూ గురువుల ఉపదేశాలను మనం పాటిస్తే జీవనం బంగారంగా సాగుతుందన్నారు. మానవుడు అనేక ఆశలకు లోనవుతుంటాడు. అయితే యోగి ఆశలను వదిలి సాధనకర్తగా తయారువుతాడన్నారు. ఈ సందర్భంగా వందలాది మందికి కాషాయ వస్త్రాలను బహూకరించారు. తాతయ్య రచించిన తాటాకుల పుస్తకాలను విశేషంగా పూజించారు. నలమూలల నుంచి భక్తజనం తరలివచ్చారు. రాత్రి అఖండ భజన సాగింది.