
హెచ్ఏఎల్ను తరలిస్తే సహించేది లేదు
శివాజీనగర: బెంగళూరులోని హెచ్ఏఎల్ని తరలిస్తారా.. అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బెంగళూరులోని హెచ్ఏఎల్ను ఏపీలో విస్తరించాలని కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరారు. కేంద్రానికి చంద్రబాబు వినతి నేపథ్యంలో హెచ్ఏఎల్ ఉత్పత్తి యూనిట్లు ఆంధ్రప్రదేశ్కు తరలిపోతున్నాయని కొన్ని వర్గాలు ప్రచారం ప్రారంభించాయి. హెచ్ఏఎల్కు ఆంధ్ర కర్ణాటక సరిహద్దుకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న లేపాక్షిలో 10,000 ఎకరాల భూమిని అందించేందుకు సిద్ధమని చంద్రబాబు చెప్పారు. కర్ణాటకలో బెంగళూరు, తుమకూరులో హెచ్ఏఎల్కు ప్రధాన ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, శిక్షణా విమానాలు ఇందులో తయారవుతున్నాయి.
నెహ్రూ స్థాపించిన సంస్థ: డిప్యూటీ సీఎం
డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ హెచ్ఏఎల్ను బీజేపీ (మోదీ ప్రభుత్వం) ఏర్పాటు చేయలేదు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ బెంగళూరులో స్థాపించారు. కర్ణాటక హెచ్ఏఎల్ యూనిట్లను కాపాడుకోవడానికి మేము దేనికై నా సిద్ధం అని అన్నారు. ఈ విషయంలో కర్ణాటక బీజేపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎం.బీ.పాటిల్ మాట్లాడుతూ, హెచ్ఏఎల్ బెంగళూరులోని కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయి. కొత్త యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే చేసుకోనీ అన్నారు. ఐదోతరం అత్యాధునిక మధ్యతరహా యుద్ధ విమానం (ఏఎంసీఏ) ప్రాజెక్ట్ బెంగళూరులో ఉన్న ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఏడీఏ) ఆధ్వర్యంలో హెచ్ఏఎల్ సహకారంతో నడుస్తోంది. ఈ తరుణంలో వివాదం రేకెత్తడంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.
తేల్చిచెప్పిన సీఎం, డిప్యూటీ సీఎంలు
సీఎం చంద్రబాబు ధోరణిపై ఆగ్రహం
అది సాధ్యం కాని పని: సీఎం
చంద్రబాబు వ్యాఖ్యలపై ప్రభుత్వ నేతలు తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఈ విషయమై మాట్లాడుతూ హెచ్ఏఎల్ తరలింపు సాధ్యం కాదని తేల్చిచెప్పారు. కర్ణాటకలో హెచ్ఏఎల్ యూనిట్లను కాపాడుకుంటామని స్పష్టం చేశారు. నాకు తెలిసినంతవరకూ ఇది సాధ్యపడదు, హెచ్ఏఎల్ తరలింపు జరగదు అని సిద్దరామయ్య పేర్కొన్నారు.

హెచ్ఏఎల్ను తరలిస్తే సహించేది లేదు