
పాకిస్తాన్ జిందాబాద్ అంటే షూట్ చేయాలి
● శాసనమండలి సభ్యుడు ఎ.హెచ్.విశ్వనాథ్
మైసూరు : భారత దేశంలో ఉంటూ ఈ దేశం గాలి పీల్చుతూ పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వారిని షూట్ చేయాలని శాసన మండలి సభ్యుడు ఎ.హెచ్.విశ్వనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మైసూరులో మీడియాతో మాట్లాడారు. మన దేశంలో ఉంటూ శత్రు దేశమైన పాక్కు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. పహల్గాంలో ఉగ్రవాదులు 26 మందిని పొట్టన బెట్టుకున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో ఉగ్రవాదానికి ఊతం ఇస్తూ పాక్కు అనుకూలంగా నినాదాలు చేసిన వారిని తుపాకులతో కాల్చివేయాలన్నారు.
రాయర చిత్రం.. మంత్రముగ్ధం
రాయచూరు రూరల్: మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వాముల మఠంలో శ్రీగురు రాఘవేంద్ర స్వాముల ఫొటోను భక్తిశ్రద్ధలతో భక్తులు ముగ్గులతో చిత్రీకరించారు. గురువారం మంత్రాలయ మఠం ప్రాంగణంలో మైసూరుకు చెందిన తొమ్మిది మంది కళాకారులు 41,346 చదరపు అడుగుల మేర 22 గంటల పాటు శ్రమించి 3 వేల కేజీల ముగ్గు పొడిని వినియోగించి భారీ ముగ్గు వేశారు. మైసూరుకు చెందిన పునీత్, లక్ష్మి, ఆదిత్య, సంప్రీత్, సంజయ్, రవిచంద్రన్, రాఘవ, మంజునాథ్, రాజు, మధు, అరవింద్, గిరీష్, కుమారస్వామిల శ్రమను పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ ప్రశంసించారు.
మునిరత్నపై చార్జిషీట్కు స్పీకర్ అనుమతి కోరిన సిట్
యశవంతపుర: బీబీఎంపీ కాంట్రాక్టర్ చలువరాజును చంపుతానని బెదిరించిన కేసులో బెంగళూరు ఆర్ఆర్ నగర ఎమ్మెల్యే మునిరత్నపై
అవినీతి నిరోధక చట్టం– 17(ఎ) ప్రకారం చార్జిషీట్ వేయటానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రత్యేక దర్యాప్తు దళం(ఎస్ఐటీ) విధానసభ సభాపతి యూటీ ఖాదర్కు మనవి చేసింది. బీబీఎంపీ మాజీ సభ్యుడు వేలు నాయ్కర్పై కుల నింద చేసిన కేసులో చార్జిషీట్ వేయటానికి ప్రభుత్వం అనుమతించింది. చెత్త తొలగింపునకు సంబంధించి కాంట్రాక్టర్ చలువరాజుపై మునిరత్న దౌర్జన్యం చేసి హత్య చేస్తానంటూ బెదిరించిన ఆరోపణలకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెత్త తొలగింపునకు ఆటోను తీసిస్తానని చెప్పి కాంట్రాక్టర్ వద్ద నుంచి రూ.20 లక్షలు డబ్బు తీసుకున్నట్లు ఎమ్మెల్యే మునిరత్నపై ఆరోపణలున్నాయి. ఇదే కాకుండా మాజీ కార్పొరేటర్ మంజుల భర్త నారాయణస్వామిని హనీట్రాప్కు యత్నించిన కేసులో మునిరత్నపై సాక్ష్యాధారాలు లేనందున ప్రజాప్రతినిధుల కోర్టులో సిట్ పోలీసులు బీ–రిపోర్ట్ను దాఖలు చేశారు.