అలరిస్తున్న పెయింటింగ్స్‌ ప్రదర్శన | - | Sakshi
Sakshi News home page

అలరిస్తున్న పెయింటింగ్స్‌ ప్రదర్శన

Apr 26 2025 12:50 AM | Updated on Apr 26 2025 12:50 AM

అలరిస

అలరిస్తున్న పెయింటింగ్స్‌ ప్రదర్శన

బనశంకరి: మలెనాడుకు చెందిన వర్ధమాన కళాకారుడు కోటెగద్దె రవి గీసిన పెయింటింగ్స్‌ ఆహుతులను ఆకట్టుకున్నాయి. బనశంకరి రెండోస్టేజ్‌ పెడలిటస్‌ ఆర్ట్‌ గ్యాలరీలో స్పిరిచువల్‌ జర్నీ ఆఫ్‌ ఇండియా పేరుతో విభిన్న రకాల పెయింటింగ్స్‌ ప్రదర్శన నగరవాసులకు కనువిందు చేస్తోంది. ఆధ్యాత్మికతను ఇతివృత్తంగా చేసుకుని కళాకారుడు కోటెగద్దె రవి తమ మనసులోని భావాలను కుంచె ద్వారా నవ్యమైన చిత్రాలకు జీవం పోశారు. పతంజలి మహర్షి, మధ్వాచార్యులు, రామానుజాచార్య, బసవణ్ణ, అక్కమహాదేవి, అల్లమప్రభు, ధన్వంతరి తదితరుల పెయింటింగ్స్‌ ను ఎంతో అద్భుతంగా గీశారు. అంతేగాక సెమి అబ్‌స్ట్రాట్‌ స్టైల్‌ పెయింటింగ్‌ను నవ్యంగా గీశారు. భారతదేశంలో ఆధ్యాత్మికత కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తుల పెయింటింగ్స్‌ ను తనదైన శైలిలో రూపకల్పన చేశారు.

అలరిస్తున్న పెయింటింగ్స్‌ ప్రదర్శన1
1/3

అలరిస్తున్న పెయింటింగ్స్‌ ప్రదర్శన

అలరిస్తున్న పెయింటింగ్స్‌ ప్రదర్శన2
2/3

అలరిస్తున్న పెయింటింగ్స్‌ ప్రదర్శన

అలరిస్తున్న పెయింటింగ్స్‌ ప్రదర్శన3
3/3

అలరిస్తున్న పెయింటింగ్స్‌ ప్రదర్శన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement