
హిజాబ్, జంధ్యం వివాదాలు వేర్వేరు
హుబ్లీ: జంధ్యం విషయాన్ని అనవసరంగా బీజేపీ నేతలు పెద్దది చేస్తున్నారు. బెళగావిలో బీజేపీ ఎమ్మెల్యేలు ముందు నిలబడి ఆందోళన చేపట్టారని బెళగావి జిల్లా ఇన్చార్జి మంత్రి సతీష్ జార్కిహోళి తెలిపారు. ఆయన బెళగావిలో మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఎవరికై నా అన్యాయం జరిగితే ఈ ఎమ్మెల్యేలు ఎవరూ రారు. అందరిని ఒకే దృష్టితో చూడాలంటూ బీజేపీ ఎమ్మెల్యే అభయ్ పాటిల్ మంత్రికి చురక వేశారు. బీజేపీ సర్కారులో హిజాబ్ వివాదం జరిగింది, ఇప్పుడేమో జంధ్యం వివాదంపై మంత్రి స్పందిస్తూ అది వేరే, ఇది వేరే. ఇది ఆకస్మికంగా జరిగింది. రెండింటినీ పోల్చడానికి కుదరదు. బీజేపీ ఆందోళన చేస్తోంది. ప్రస్తుతం వారికేమీ పని లేదు. ఈక్రమంలో నేడు బెళగావిలో బీజేపీ ఎమ్మెల్యేలే ఆందోళనకు అందరిని పిలుచుకొని వచ్చారన్నారు. ఎవరు దోషులో వారిపై చర్యలు చేపట్టాలి. అయితే ప్రభుత్వానికి దీనికి ఏం సంబంధం అన్నారు. తొలి ఏడాది నుంచి కొత్త జిల్లాధికారి కార్యాలయ భవనం కావాలని ప్రయత్నిస్తున్నాను. మూడు దశల్లో నిర్మాణ పనులు జరుగుతాయి. ప్రస్తుతం తొలి దశ నిర్మాణం ప్రారంభం కానుందన్నారు. ప్రస్తుతం ఉన్న కార్యాలయాలు తాత్కాలికంగా వేరే చోటకు తరలిస్తామన్నారు. ఈ నిర్మాణం పూర్తి కావడానికి రెండు, మూడేళ్లు పట్టవచ్చు.
త్వరలో మరిన్ని పనులు జాతికి అంకితం
ఇక పైవంతెన పూర్తి కావడానికి కనీసం రెండేళ్లు కావాలి. వానాకాలం గడిచాక పనులు ప్రారంభం అవుతాయి. స్మార్ట్ సిటీ పథకం కింద ఒక్కొక్కటి పూర్తవుతాయని వివరించారు. నగర కేంద్ర బస్టాండ్ ఓ నెలలో పూర్తి అవుతుందన్నారు. దానిని జూన్ 1న ప్రారంభిస్తామన్నారు. మరిన్ని పనులు జాతికి అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అక్రమ ఇళ్ల గురించి ఆదివారం సీఎం అధికారికంగా ఆదేశాలను ఇచ్చారన్నారు. ఇళ్లు నిర్మించుకుంటే చాలు అలాంటి వారికి కార్పొరేషన్ కనీస వసతులను కల్పిస్తుందన్నారు. రింగ్ రోడ్డు నిర్మాణానికి ఎటువంటి సమస్య లేదన్నారు. అయినా జాప్యం జరుగుతోందని, దీన్ని తప్పకుండా పూర్తి చేసి తీరుతామన్నారు. బెంగళూరు తరహాలో బెళగావిలో అభివృద్ధి విషయానికి సంబంధించి దీనికి చాలా సమయం పడుతోందన్నారు. బెంగళూరుకు 300 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పటి నుంచి ఎదుగుతోంది. బెళగావి అభివృద్ధి 2013లో సిద్దరామయ్య ప్రభుత్వం వచ్చాకే మొదలైందన్నారు. పూర్తి అభివృద్ధికి పదేళ్ల సమయం అవసరం అన్నారు. రాహుల్ జార్కిహోళి డీడీసీ బ్యాంక్ ఎన్నికల్లో పోటీపై మాట్లాడుతూ దీనిపై ఇంకా చర్చ జరుగుతుంది. అన్ని సొసైటీలతో సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పటికే యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో రాహుల్ రాజకీయ ప్రవేశం చేశారని ఆయన గుర్తు చేశారు.
మంత్రి సతీష్ జార్కిహోళి