బెంగళూరు: ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో టోల్ గేట్ చార్జీలు పెరగనుండటంతో వాహన యజమానులు, డ్రైవర్ల జేబుకు రంధ్రం పడనుంది. ప్రతి ఏడాది తరహాలో ఈసారి 3 నుంచి 5 శాతం మేర టోల్ రుసుము పెరగనుంది. రాష్ట్రంలోని 9 జాతీయ రహదారుల్లో టోల్ గేట్లలో ఇది వర్తిస్తుంది.
మైసూరు–బెంగళూరు ఎక్స్ప్రెస్ వే ప్రయాణం మరింత వ్యయం కానుంది. జాతీయ హైవే అథారిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గత రెండేళ్లుగా ఏటా టోల్ పెంచుతూ ఉన్నారు. ఇప్పటికే ఎన్హెచ్ఐఏ ఏప్రిల్ 1 నుంచి వర్తించేలా ఫాస్ట్ట్యాగ్ పాస్ ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో హైవేలలో సొంత వాహనాలలో ప్రయాణ ఖర్చు పెరగనుంది.


