లాభాల బాటలో పీఎల్‌డీ బ్యాంకు | - | Sakshi
Sakshi News home page

లాభాల బాటలో పీఎల్‌డీ బ్యాంకు

Sep 22 2023 12:22 AM | Updated on Sep 22 2023 12:22 AM

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం  - Sakshi

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం

కోలారు: తాలూకాలోని పీఎల్‌డీ బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.11 లక్షల నికర లాభం గడించినట్లు బ్యాంకు అధ్యక్షుడు కృష్ణేగౌడ తెలిపారు. గురువారం నగరంలోని టి.చెన్నయ్య రంగమందిరంలో బ్యాంకు సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత సంవత్సరం బ్యాంకు మొత్తం రూ.51.11 లక్షల డిపాజిట్ల నుంచి రైతులకు రూ.3.41 కోట్ల రుణాలు అందించిందన్నారు. రుణాల వసూళ్లలో బ్యాంకు ఉభయ జిల్లాల్లో మొదటి స్థానంలో ఉందన్నారు. బ్యాంకు మాజీ అధ్యక్షుడు విట్టప్పనహళ్లి వెంకటేష్‌ మాట్లాడుతూ 88 ఏళ్ల క్రితం ప్రారంభమైన బ్యాంకు రైతులకు ఉత్తమ సేవలు అందించిందన్నారు. కార్యక్రమంలో బ్యాంకు ఉపాధ్యక్షుడు ఎం గోవిందప్ప, డైరెక్టర్‌ శశిధర్‌, శివకుమార్‌, కేసీ మంజునాథ్‌, జి.అమరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ట్యాంకర్‌ ఢీకొని ఆటో డ్రైవర్‌ మృతి

కోలారు: వేగంగా వచ్చిన ట్యాంకర్‌ వాహనం ఆటోను ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్‌ దుర్మరణం పాలైన ఘటన తాలూకాలోని మడేరహళ్లి వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. సూలూరు గ్రామానికి చెందిన ధనుష్‌(29) అనే ఆటో డ్రైవర్‌ తాలూకాలోని మడేరహళ్లి వద్ద నుంచి కోలారు వైపునకు వస్తుండగా ఆటోను వెనుక నుంచి వస్తున్న ట్యాంకర్‌ ఢీకొనడంతో ఆటో నుంచి కిందపడిన ధనుష్‌ అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం జరగగానే డ్రైవర్‌ ట్యాంకర్‌ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. విషయం తెలిసిన వెంటనే కోలారు రూరల్‌ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.

ఘటనాస్థలంలో ప్రమాద దృశ్యం  
1
1/1

ఘటనాస్థలంలో ప్రమాద దృశ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement