మహిళలే దేశానికి ఆయువుపట్టు | - | Sakshi
Sakshi News home page

మహిళలే దేశానికి ఆయువుపట్టు

Mar 10 2026 12:52 PM | Updated on Mar 10 2026 12:52 PM

మహిళలే దేశానికి ఆయువుపట్టు

కరీంనగర్‌సిటీ: మహిళలే దేశానికి ఆయువుపట్టు అని శాతవాహన రిజిస్ట్రార్‌ ఆచార్య సతీశ్‌కుమార్‌ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం విశ్వవిద్యాలయంలో ఉమెన్స్‌ సెల్‌–జాతీయ సేవా పథకం సంయుక్తంగా ఆర్ట్స్‌ కళాశాల సెమినార్‌ హాల్లో వేడుకలు నిర్వహించారు. మహిళా సెల్‌ సంచాలకులు డాక్టర్‌ నమ్రత అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి రిజిస్ట్రార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక అతిథి గైనకాలజిస్ట్‌ నయనీ వింజమూరి మాట్లాడుతూ, ఆధునిక సమాజంలో కూడా మహిళలపై జరుగుతున్న వేధింపులు, అఘాయిత్యాలను తీవ్రంగా ఖండించాలన్నారు. లింగ సమానత్వం కోసం పోరాడాలని, ఆధునిక మహిళ ఆకాశమే హద్దుగా ఎదగాలని ఆకాంక్షించారు. వీసీ డాక్టర్‌ హరికాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement