కరీంనగర్ కార్పొరేషన్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో అమలు చేస్తున్న వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) పథకాన్ని కేవలం అక్కడికే పరిమితం చేయడంపై కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై సీఎం రేవంత్రెడ్డికి లేఖ రాసి ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను బకాయిలపై ఈనెల 31 వరకు 90 శాతం రాయితీతో పాటు 5 శాతం వడ్డీ మినహాయింపు కల్పిస్తూ ఓటీఎస్ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుండడం స్వాగతించదగ్గ విషయమేనని పేర్కొన్నారు. అదే పథకాన్ని కరీంనగర్ నగరపాలక పరిధిలో కూడా అమలు చేస్తే వేలాది కుటుంబాలకు ఉపశమనం కలుగుతుందన్నారు. ఇతర పట్టణాలకు కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.


