నేటి నుంచి ధనుర్మాస వ్రత మహోత్సవాలు
విద్యానగర్(కరీంనగర్): ధనుర్మాసం మంగళవారం నుంచి ప్రారంభం అవుతుందని ముయార గిరి పీఠదీశులు నమిలకొండ రమణా చార్య స్వామి తెలిపారు. కరీంనగర్ తిరుమలనగర్లోని శ్రీ నిలయంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు మంగళవారం నుంచి జనవరి 14వ తేదీ వరకు నిర్వహిస్తున్న ట్లు వెల్లడించారు. ప్రతిరోజు ఉదయం అర్చన, ఆరాధన సేవాకాలం, సాయంత్రం 5.30 నుంచి 6.30 వరకు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, 30వ తేదీ వైకుంఠ ఏకా దశి పూజలు, జనవరి 11న కూడారై ఉత్సవం, 14వ తేదీన ఉదయం 10 గంటల నుంచి గోదారంగనాధుల కల్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరారు.
కరీంనగర్టౌన్: సీఐటీయూ అఖిలభారత 18వ మహాసభలు విశాఖపట్నంలో ఈ నెల 31వ తేదీ నుంచి జనవరి 4 వరకు జరగనున్న నేపథ్యంలో సోమవారం జిల్లాకేంద్రంలోని ప్రకాశం గంజ్లో సంఘం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి పతాకం ఆవిష్కరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆవుల రాజయ్య, సురేందర్, సుక్క కుమార్, ఆవుల లక్ష్మణ్, సంపత్, బిక్షపతి, రాజమౌళి పాల్గొన్నారు.
సప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన యూ నివర్సిటీ పరిధిలోని కళాశాలలకు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఎడ్) కోర్సులో 1వ, 3వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ విద్యార్థులు ఈ నెల 24లోపు ఫీజు చెల్లించాలని పరీక్షలనియంత్రణ అధికారి డి.సురేశ్ కుమార్ తెలిపా రు. పరీక్షలు 2026 జనవరిలో జరుగుతా యని, రూ.500 అపరాధ రుసుంతో ఈ నెల 30లోపు ఫీజు చెల్లించవచ్చునని పేర్కొన్నారు.
నేటి నుంచి ధనుర్మాస వ్రత మహోత్సవాలు


