మాబ్‌ ఆపరేషన్‌ డ్రిల్‌పై శిక్షణ | - | Sakshi
Sakshi News home page

మాబ్‌ ఆపరేషన్‌ డ్రిల్‌పై శిక్షణ

Jun 14 2025 9:52 AM | Updated on Jun 14 2025 9:56 AM

మాబ్‌

మాబ్‌ ఆపరేషన్‌ డ్రిల్‌పై శిక్షణ

కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిధి లోని ఏఆర్‌, క్విక్‌ రియాక్షన్‌ టీం సిబ్బందికి సీపీ గౌస్‌ ఆలం ఆధ్వర్యంలో సీటీసీలో మాబ్‌ ఆపరేషన్‌పై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. శాంతిభద్రతల సమస్యలు తలెత్తినప్పుడు అల్లరి మూకలను సమర్థవంతంగా చెదరగొట్టడానికి పోలీసులు నిర్వర్తించాల్సిన విధులను అభ్యాసం చేయడమే ఈ శిక్షణ ఉద్దేశం అన్నారు. లాఠీ డ్రిల్‌, గ్యాస్‌ గన్‌ పేల్చే విధానం, ఫైరింగ్‌, స్మోక్‌ గన్‌ ఫైరింగ్‌, వజ్ర వాహనం వినియోగంపై శిక్షణ ఇచ్చారు. ఆర్‌ఐలు రజనీకాంత్‌, జానీమియా, కుమారస్వామి, శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.

మున్సిపాలిటీల్లో వైద్య శిబిరాలు

కరీంనగర్‌టౌన్‌: జిల్లాలోని కరీంనగర్‌, చొప్పదండి, హుజూరాబాద్‌, జమ్మికుంట మున్సిపల్‌ కార్యాలయాల్లో సిబ్బందికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వైద్య శిబిరాలు నిర్వహించారు. గర్భాశయ ముఖద్వార కేన్సర్‌, క్యాన్సర్‌ స్క్రీనింగ్‌, కంటి పరీక్షలు, అధిక రక్తపోటు, షుగర్‌ స్క్రీనింగ్‌ చేసి మందులు అందజేశారు. సీజనల్‌ వ్యాధులు, నివారణ చర్యలను వివరించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ వెంకటరమణ, వైద్యాధికారులు ఉమాశ్రీ, సాజిదా, సనజవేరియా, విమల, అలేఖ్య, నవ్య, సాయిప్రసాద్‌, ప్రణీత పాల్గొన్నారు.

విజయవంతం చేయండి

కరీంనగర్‌: రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు విజయవంతం చేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కంపాటి పృథ్వీ, ప్రధాన కార్యదర్శి ఎస్‌.అనిల్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు అంగిడి కుమార్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. జిల్లాకేంద్రంలో జూలై 12,13 తేదీల్లో నిర్వహించే రాజకీయ శిక్షణ తరగతులకు రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థి నాయకత్వం హాజరవుతుందని, ప్రొఫెసర్లు, మేధావులు వస్తున్నారన్నారు. చరణ్‌, దిరాజ్‌ వంశీ, విష్ణు,వేణు, రాహుల్‌, రాకేశ్‌, విజయ్‌, ప్రణయ్‌, సాయి, సిద్ధు పాల్గొన్నారు.

నాణ్యమైన విద్య అందిస్తాం

తిమ్మాపూర్‌: మండలంలోని రామకృష్ణకాలనీ ప్రా థమికోన్నత పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం వైభవంగా జరిగింది. డీఈవో మొండయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాణ్యమై న విద్యను అందించడంలో ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని కొనియాడారు. ఎంఈవో శ్రీని వాస్‌ మాట్లాడుతూ.. ఉన్నతవిద్యను అందించడానికి తమవంతు సహకారం అందిస్తామన్నా రు. హెచ్‌ఎం ఎం.మహేశ్వర్‌, కార్యదర్శి శ్రీకాంత్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు పి.శ్రీనివాస్‌, చైల్డ్‌ సంరక్షణ కోఆర్డినేటర్‌ సంపత్‌, జీసీడీవో కపారాణి, పాఠశాల చైర్మన్‌ పురంలక్ష్మి, పాల్గొన్నారు.

పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఏజెంట్లకు ఆహ్వానం

కరీంనగర్‌: తపాలశాఖ కరీంనగర్‌ డివిజన్‌ పరిధిలో, కమిషన్‌ బేసిస్‌తో తపాల జీవిత బీమా ఏజెంట్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డివిజన్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ కె.శివాజీ తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులై, 18–50ఏళ్ల మధ్య ఉన్న కరీంనగర్‌ డివిజన్‌కు చెందినవారు అర్హులన్నారు. దరఖాస్తులను కరీంనగర్‌ డివిజన్‌ఆఫీస్‌లో ఈనెల 27లోపు అందజేయాలని, ఎంపికై న అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లతో హాజరుకావాలని పేర్కొన్నారు. సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.5వేలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

క్వింటాల్‌ పత్తి రూ.7,400

జమ్మికుంట: స్థానిక మార్కెట్లో క్వింటాల్‌ శుక్రవారం పత్తి ధర గరిష్టంగా రూ.7,400 పలికింది. 31క్వింటాళ్ల పత్తిని రైతుల తెచ్చారు. శని, అదివారాలు మార్కెట్‌కు సెలవు ఉంటుందని కార్యదర్శి మల్లేశం తెలిపారు.

మాబ్‌ ఆపరేషన్‌ డ్రిల్‌పై శిక్షణ1
1/3

మాబ్‌ ఆపరేషన్‌ డ్రిల్‌పై శిక్షణ

మాబ్‌ ఆపరేషన్‌ డ్రిల్‌పై శిక్షణ2
2/3

మాబ్‌ ఆపరేషన్‌ డ్రిల్‌పై శిక్షణ

మాబ్‌ ఆపరేషన్‌ డ్రిల్‌పై శిక్షణ3
3/3

మాబ్‌ ఆపరేషన్‌ డ్రిల్‌పై శిక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement