రోడ్డు ప్రమాదంలో.. బీటెక్‌ విద్యార్థి విషాదం! | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో.. బీటెక్‌ విద్యార్థి విషాదం!

Jul 25 2024 2:00 AM | Updated on Jul 25 2024 11:47 AM

-

హైదరాబాద్‌ శివారు ఘట్‌కేసర్‌లో ఘటన..

సంగెం గ్రామంలో విషాదం!

కరీంనగర్: హైదరాబాద్‌ శివారు ఘట్‌కేసర్‌ వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని సంగెం గ్రామానికి చెందిన బీటెక్‌ విద్యార్థి పొతుకూరి హర్షవర్దన్‌ రెడ్డి దుర్మరణం పాలయ్యాడు. హర్షవర్ధన్‌రెడ్డి(19) హైదరాబాద్‌లో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం కాలేజికి వెళ్లి వచ్చి సాయంత్రం తన స్నేహితుడు, మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన మనీష్‌తో బైక్‌పై బయటకు వెళ్లారు.

తిరిగి వస్తుండగా ఘట్‌కేసర్‌ వద్ద బైక్‌ అదుపు తప్పి డివైడర్‌కు ఢీ కొట్టి ఇద్దరూ కింద పడ్డారు. హర్షవర్దన్‌కు ఛాతి, ముఖానికి తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్థానికులు వెంటనే అంబులెన్స్‌లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే హర్షవర్దన్‌ రెడ్డి మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మనీష్‌కు కాళ్లకు గాయాలై చికిత్స పొందుతున్నాడు.

సంగెంలో విషాదం..
సంగెం గ్రామానికి చెందిన పొతుకూరి రవికుమార్‌ రెడ్డి, స్వప్న దంపతులకు కూతురు మేఘనా, కుమారుడు హర్షవర్దన్‌ రెడ్డి ఉన్నారు. వ్యవసాయంతోపాటు ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తున్న రవికుమార్‌ ఇద్దరు పిల్లలను హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ కళాశాలలో చదివిస్తున్నాడు. వారంక్రితమే బర్త్‌డే చేసుకుని హైదరాబాద్‌ వెళ్లిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో తల్లిదండ్రులు బోరున విలపించిన తీరు పలువురిని కలిచి వేసింది. సంగెంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement