
అభివృద్ధిలో తిరుగులేని వేముల
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్రం సి ద్ధించాక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను అభివృద్ధి చే యడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన మోతె గ్రామం ఉన్న బాల్కొండ నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా మూడుసార్లు గెలుపొందారు. ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రణాళి కాబద్ధంగా అడుగులు వేశారు.
తండ్రి ఆకాంక్షలను నెరవేరుస్తూ..
ప్రశాంత్రెడ్డి తండ్రి వేముల సురేందర్రెడ్డి బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా గు ర్తింపు పొందారు. ఆయన బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు. అంతకుముందు నిజాం షుగర్స్ చైర్మన్ గా, టీడీపీ జిల్లా అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. బీఆర్ఎస్ స్థాపించిన సమయంలో కేసీఆర్తో ఉన్న గుప్పెడు మందిలో సురేందర్రెడ్డి ఒకరు. ఆయన తుదిశ్వాస విడిచే వరకూ బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో సురేందర్రెడ్డి ఎమ్మెల్యేగా ఓటమి చెందగా ఆ సమయంలో ప్రశాంత్రెడ్డి బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జీగా పనిచేశారు. తర్వాత 2014, 2019, 2023 లలో వరుసగా బాల్కొండ నుంచి గెలుస్తూ వస్తున్నారు. కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా సేవలందించారు. తండ్రి సురేందర్రెడ్డి ఆశయాల మేర కు నియోజకవర్గంలో అనేక అభి వృద్ధి కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచారు. ఉమ్మడి జిల్లాకు సాగునీరు అందించే, ఆయకట్టు స్థిరీకరణ చేసే కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 20, 21, 21ఏ ప్యాకేజీ పనులను మంజూరు చేయించి 70 శాతం పూర్తి చేయించారు. సారంగాపూర్, మెంట్రాజ్పల్లి, మంచిప్ప వద్ద పంప్హౌస్ పనులు, మెయిన్ పైప్లైన్ పనులు 70 శాతం పూర్తి చేయించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లు నిర్మింపజేశారు. రూ. 14 కోట్లతో నిజామాబాద్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) భవనాన్ని పూర్తి చేయించారు. మాధవనగర్, అర్సపల్లి వద్ద ఆర్వోబీ కలల ను సాకారం చేశారు. మాధవనగర్–కంఠేశ్వర్ డబు ల్ రోడ్డును నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయించారు.
బాల్కొండలో ప్రగతి పరుగులు..
బాల్కొండ నియోజకవర్గంలో మొత్తం రూ.3 వేల కోట్లతో రాష్ట్రంలోనే అత్యధిక అభివృద్ధి పనులు చే యించారు. కాళేశ్వరం 21ఏ ప్యాకేజీ ద్వారా రూ. 1,400 కోట్లతో 80 వేల ఎకరాలకు నీరందించారు. ఈ ప్యాకేజీ కింద పదేళ్లలో రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేశారు. రూ. 600 కోట్ల శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం పనుల్లో భాగంగా బాల్కొండ నియోజకవర్గంలో రూ. 1,900 కోట్లు ఖర్చు చేశారు. రూ. 200 కోట్లతో 2 చెక్డ్యాంలు కట్టించారు. ఈ చెక్డ్యాంలు చూసిన కేసీఆర్ రాష్ట్రమంతటా ఇలాంటివి కట్టించారు. రూ. వెయ్యి కోట్లతో 10 ఎత్తిపోతలు నిర్మించారు. రోడ్లు, వంతెనలు, సబ్స్టేషన్లు, ఆస్పత్రులు, పాఠశాలల భవనాల నిర్మాణానికి వందలాది కోట్లు మంజూరు చేయించారు. భీంగల్లో బస్డిపో, లింబాద్రి గుట్ట అభివృద్ధి, భీంగల్, బాల్కొండలలో డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయించారు.
వరదకాలువకు తూములు..
ఎస్సారెస్పీ వరద కాలువకు జగిత్యాల, కోరుట్ల, బాల్కొండ నియోజకవర్గాల పరిధిలో 16 చోట్ల తూ ములు ఏర్పాటు చేయించారు. వీటి ద్వారా మొత్తం 45 చెరువులు నిండుతున్నాయి. వీటికి నిర్వహణ ఖర్చు అనేదే లేదు. రూ. 12 కోట్లతో లక్ష్మి కాలువ ఆధునికీకరణ, రూ. 6 కోట్లతో నవాబ్ ఎత్తిపోతల పథకం, రూ. 12 కోట్లతో నిజాంసాగర్ ఆధునికీకరణ పనులు చేయించారు. రాష్ట్రంలోనే మొదటిసారి గా చెక్డ్యాములకు తూములు ఏర్పాటు చేయించి పచ్చలనడ్కుడ చెరువు నింపారు.
ఏది అడిగినా కేసీఆర్ కాదనలేదు..
నియోజకవర్గంలో గ్రామాల వారీగా సమస్య లు నోట్ చేసుకొని అందుకు అనుగుణంగా బడ్జెట్ మంజూరు చేయించుకున్నా. నేను ఏది అడిగినా కేసీఆర్ కాదనలేదు. చెక్డ్యాంల కారణంగా వేలాది బోర్లు రీచార్జి అయ్యాయి. కొత్త బోర్లు వేసే అవసరం లేకుండా పోయింది. కాళేశ్వరం 21వ ప్యాకేజీలో భాగంగా డిస్ట్రిబ్యూటరీ లైన్లు వేయించాం. ప్రతి రెండున్నర ఎకరాలకు ఒక ఔట్లెట్ పాయింట్ వచ్చేలా చూశాం. ఈ నీరు వాగులోకి రావడంతో చెక్డ్యాంలు నిండుతున్నాయి. చెరువులూ జలకళ సంతరించుకుంటున్నాయి.
– వేముల ప్రశాంత్రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే
ఉమ్మడి జిల్లా ప్రగతిలో కీలక పాత్ర
కాళేశ్వరం 20, 21, 21ఏ ప్యాకేజీలు, ఆర్వోబీలు, న్యాక్ భవనాల నిర్మాణం..
పదేళ్లలో రూ.3 వేల కోట్లతో
బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి
వరుసగా మూడుసార్లు శాసనసభకు ఎన్నికై న ప్రశాంత్రెడ్డి
వేముల ఇరిగేషన్ విధానాలను మెచ్చి రాష్ట్రమంతటా అమలు చేసిన కేసీఆర్