మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామిని శనివారం అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, అర్చకులు మధుసూదనాచారి, రవిచారి, అధికారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అర్చకులు ఆలయ విశిష్టతను వివరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శేషవస్త్రంతో సత్కరించి జ్ఞాపిక బహూకరించారు.
తుమ్మిళ్ల ప్రాజెక్ట్లో
రిజర్వాయర్ నిర్మించరా?
‘చలో అసెంబ్లీ’ని జయప్రదం చేయండి
గద్వాల: ఐకేపీ వీఓఏల సమస్యల పరిష్కారం కోసం బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అంజి పిలుపునిచ్చారు. శనివారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఏర్పాటు చేసి రెండేళ్లు కావొస్తున్నా ఇంకా నెరవేర్చడం లేదన్నారు. ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలోనే నిధులు కేటాయించి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో భాగంలో బుధవారం చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టామని, కార్యక్రమంలో వీఓఏ ఉద్యోగులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో నాయకులు శ్రీనివాస్, తిరుమలేష్, బీసమ్మ, వెంకట్రామయ్య, మునీశ్వరి, రాధమ్మ పాల్గొన్నారు.


