పరిశోధనలకు పునాది | - | Sakshi
Sakshi News home page

పరిశోధనలకు పునాది

Oct 10 2025 8:04 AM | Updated on Oct 10 2025 8:04 AM

పరిశో

పరిశోధనలకు పునాది

కీలక మైలురాయి..

పీయూలో రూ.11 కోట్లతో రీసెర్చ్‌ ఫెసిలిటీ భవనం నిర్మిస్తున్నాం. దీనిలో ఎక్విప్‌మెంట్‌ కోసం రూ.13 కోట్లు పీఎం ఉషా స్కీం ద్వారా కేటాయించాం. ఈ భవన నిర్మాణం చివరిదశలో ఉంది. ఇది అందుబాటులోకి వస్తే రీసెర్చి స్కాలర్స్‌, విద్యార్థులు, అధ్యాపకులు, ప్రైవేటు ఫార్మ కంపెనీలు ఇక్కడ ప్రయోగాలు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇంక్యూబేషన్‌ సెంటర్‌లో స్టార్టప్‌ల ఎంటర్‌ ప్రెన్యూరర్స్‌ ప్రొటోటైప్‌ ప్రయోగాల ద్వారా కొత్త అంశాలపై దృష్టి సారించవచ్చు.

– జీఎన్‌ శ్రీనివాస్‌, పీయూ వైస్‌ చాన్స్‌లర్‌

ఎంతో ఉపయోగం..

రీసెర్చి ఫెసిలిటీ భవనం త్వరలో అందుబాటులోకి రానుంది. అందులో రీసెర్చి చేసే వారికి అన్ని రకాల వసతులు కల్పించనున్నాం. దీంతో ఇక్కడ ప్రయోగాలు చేసుకునే ప్రైవేటు వారు కొద్ది మొత్తంలో ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఇంక్యూబేషన్‌ సెంటర్‌ ద్వారా కొత్త ఆవిష్కరణలు జరిగే అవకాశం లభిస్తుంది. ఉమ్మడి పాలమూరుతోపాటు చుట్టు పక్కల జిల్లాల వారికి ఇది ఎంతో ఉపకరించనుంది.

– రమేష్‌బాబు, రిజిస్ట్రార్‌, పీయూ

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీ త్వరలో పరిశోధనలకు అడ్డాగా నిలవనుంది. విద్యార్థులు, రీసెర్చి స్కాలర్స్‌, అధ్యాపకులను పరిశోధనల పరంగా ప్రోత్సహించేందుకు పీయూలో రీసెర్చ్‌ ఫెసిలిటీ భవనాన్ని నిర్మిస్తున్నారు. 2008లో ప్రారంభం అయినప్పుడు కేవలం సంప్రదాయ కోర్సులకే పరిమితమైన పీయూ.. ప్రస్తుతం రీసెర్చ్‌ ఫెసిలిటీ సెంటర్‌ నిర్మాణంతో ప్రయోగాలకు నిలయంగా మారనుంది. తెలంగాణలో రీసెర్చ్‌ ఫెసిలిటీ భవనం ఒక్క ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రమే ఉండటం గమనార్హం. రెండేళ్ల క్రితం భవనం పనులు ప్రారంభమవగా.. దాదాపుగా చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే అందుబాటులోకి రానున్న ఈ భవన నిర్మాణం, వసతుల కల్పన కోసం ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు సైతం విడుదల చేయడంతో దీని నిర్మాణంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

రూ. 25 కోట్ల వ్యయం...

రీసెర్చి ఫెసిలిటీ భవనాన్ని నిర్మించేందుకు రూ.11 కోట్లను గతంలో కేటాయించి నిర్మాణం ప్రారంభించారు. ఇందులో 5 ల్యాబ్‌లు, రెండు సెమినార్‌ హాళ్లు, కంప్యూటర్‌ ల్యాబ్‌, ఇంక్యూబేషన్‌ సెంటర్‌ వంటివి నిర్మించనున్నారు. ఈ భవనం మరో రెండు మూడు నెలల్లో అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో ఇందులో ఏర్పాటు చేసే వసతుల కోసం నిధులను సైతం ప్రభుత్వం సమకూర్చడం గమనార్హం. ఇందులో పీఎం ఉషా స్కీం ద్వారా గత విద్యా సంవత్సరం రూ.100 కోట్లను కేటాయించగా.. ఈ నిధుల్లోంచి రూ.14 కోట్లు కేవలం రీసెర్చి ఫెసిలిటీ సెంటర్‌ కోసం మాత్రమే కేటాయించింది. ప్రభుత్వం ఒక్కో మైక్రోస్కోప్‌, ఇతర ఎక్విప్‌మెంట్‌ రూ.50 లక్షల నుంచి రూ.1.20 కోట్ల వరకు వెచ్చించనుంది. ఫిజిక్స్‌, మైక్రోబయోలజీ, బాటనీ, జువాలజీ, మ్యాథ్స్‌, ఇంజినీరింగ్‌, ఫార్మసీ వంటి వారికి ఈ ల్యాబ్‌ ఎంతో ఉపయోగపడనుంది.

పీయూలో నిర్మితమవుతున్న రీసెర్చ్‌ ఫెసిలిటీ భవనం

రూ.11 కోట్లతో భవనం, ఉమ్మడి జిల్లాలో రీసెర్చి ఊతం

రూ.14 కోట్లతో పరికరాల కొనుగోలుకు అనుమతి

ఇతరత్రా వసతుల కల్పనకు సైతం నిధులు విడుదల

ఇంక్యూబేషన్‌ సెంటర్‌తో కొత్త ఆవిష్కరణలకు ఆస్కారం

పరిశోధనలకు పునాది
1
1/2

పరిశోధనలకు పునాది

పరిశోధనలకు పునాది
2
2/2

పరిశోధనలకు పునాది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement