రీజినల్‌ స్థాయి క్రికెట్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

రీజినల్‌ స్థాయి క్రికెట్‌ పోటీలు

Dec 7 2025 8:44 AM | Updated on Dec 7 2025 8:44 AM

రీజినల్‌ స్థాయి క్రికెట్‌ పోటీలు

రీజినల్‌ స్థాయి క్రికెట్‌ పోటీలు

భూపాలపల్లి అర్బన్‌: సింగరేణి వర్క్‌ పీపుల్స్‌ అండ్‌ గేమ్స్‌ అసోసియేషన్‌ (డబ్ల్యూపీఎస్‌) భూపాలపల్లి, రామగుండం–3 ఏరియాల క్రికెట్‌ రీజినల్‌ స్థాయి క్రికెట్‌ పోటీలను శనివారం ఏరియాలోని అంబేడ్కర్‌ స్టేడియంలో నిర్వహించారు. ఈ పోటీల ప్రారంభోత్సవానికి ఏరియా సింగరేణి జనరల్‌ మేనేజర్‌ రాజేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. సింగరేణి సంస్థలో ప్రతీ ఏడాది మాదిరిగా క్రీడలను నిర్వహించడం ఆనందకరమన్నారు. ఉద్యోగులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, క్రీడలు రోజు వారి మన కార్యకలాపాలలో భాగం చేసుకోవాలని సూచించారు. ఈ పోటీల్లో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ తీసుకున్న భూపాలపల్లి జట్టు 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టపోయి 184 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఆర్జీ–3 జట్టు 20 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 160 పరుగులు మాత్రమే చేసింది. 24 పరుగుల తేడాతో భూపాలపల్లి ఏరియా జట్టు విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్‌ మేనేజర్‌ శ్యాంసుందర్‌, క్రీడల గౌరవ కార్యదర్శి శ్రావణ్‌కుమార్‌, కార్మిక సంఘాల నాయకులు రమేష్‌, బొడ్డు అశోక్‌, స్పోర్ట్స్‌ సూపర్‌వైజర్‌ పర్స శ్రీనివాస్‌, భూపాలపల్లి స్పోర్ట్స్‌ కోఆర్డినేటర్‌ పాక దేవయ్య, క్రీడాకారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement