కొవ్వొత్తులతో నివాళి
సాయి ఈశ్వరాచారి ఆత్మకు శాంతి చేకూరాలని స్వర్ణకార సంఘం సభ్యులు, కుల సంఘ పెద్దలు ఆదివారం రాత్రి పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ సెంటర్లో సాయి ఈశ్వరాచారి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షుడు రామగిరి సదానందం, నాయకులు కట్ట శంకరమూర్తి, రాజేష్, మోహన్చారి, బీబీ చారి, నవీన్ కుమార్, సురేష్, సాంబమూర్తి, రాజకుమార్, శివకుమార్, రమేష్, హరీశ్, తిరుమల పాల్గొన్నారు. – భూపాలపల్లి రూరల్


