
అధికారంలోకి వచ్చి తీరుతాం..
భూపాలపల్లి రూరల్: నరేంద్ర మోదీ పాలనలో దేశం ప్రగతి పథంలో దూసుకెళ్లుతుందని, 11 ఏళ్ల పాలన అభివృద్ధికి నిదర్శమని రానున్న రోజుల్లో తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చి డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేస్తామని బీజేపీ మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి, జిల్లా ఇన్చార్జి అల్జాపూర్ శ్రీనివాస్ అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిశీధర్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ పాలన 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆయా జిల్లాల్లో బీజేపీ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నప్పటికీ, అవగాహన లేక కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో అమలు చేయడం లేదని చెప్పారు. పార్టీలోని అన్ని కమిటీల సభ్యులు క్షేత్రస్థాయిలో మోదీ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్చార్జ్ కందుల సంధ్యారాణి మాట్లాడారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు, క్రమశిక్షణ సంఘం కన్వీనర్ నాగపూరి రాజమౌళి గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెన్నంపల్లి పాపయ్య, నాయకులు జన్నె మొగిలి, ప్రసాద్రావు, దొంగల రాజేందర్, బట్టు రవి, కంబాల రాజయ్య, వేషాల సత్యవతి, సయ్యద్ గాలిఫ్ పాల్గొన్నారు.
బీజేపీ మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి
అల్జాపూర్ శ్రీనివాస్