
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం ఎలికేశ్వరం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను హౌసింగ్ సీఈ ఎం.చైతన్యకుమార్, పీడీ లోకిలాల్ శుక్రవారం పరిశీలించారు. గ్రామంలో పర్యటించి మంజూరైన 56 ఇళ్లలో ముగ్గుపోసిన 21, బేస్మెంట్ లెవల్లో ఉన్న 4 ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ లబ్ధిదారులు 400 స్కేర్ఫీట్ నుంచి 600 స్కేర్ఫీట్ల లోపు నిర్మాణం చేయాలన్నారు. లబ్ధిదారులకు నాలుగు విడతల్లో బిల్లులు జమ అవుతాయని తెలిపారు. రూ.లక్ష బేస్మెంట్ లెవల్, రూ.లక్ష లెంటల్ లెవల్, రూ.రెండు లక్షలు స్లాబ్ లెవల్, రూ.లక్ష ప్లాస్టరింగ్ వరకు విడతల వారీగా జమ చేస్తారన్నారు. నిర్మాణం చేసే మేసీ్త్రలకు ప్రభుత్వం ఒక ధర నిర్ణయించినట్లు తెలిపారు. అధిక డబ్బులు అడిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారి వెంట ఏఈ, డీఈలు ఉన్నారు.