
నేటినుంచి నూతన విద్యాసంవత్సరం ప్రారంభం
● అన్ని హంగులతో ముస్తాబైన
ప్రభుత్వ పాఠశాలలు
● తొలిరోజే పాఠ్య, నోట్ బుక్స్, యూనిఫాం పంపిణీ
● అధునాతన టెక్నాలజీతో విద్యాబోధన
భూపాలపల్లి అర్బన్: వేసవి సెలవుల అనంతరం 2025–26 విద్యా సంవత్సరం నేటి (గురువారం) నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల పునఃప్రారంభం రోజునే విద్యార్థులకు దుస్తులు, పాఠ్య పుస్తకాలు, నోట్, వర్క్బుక్స్ అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో మెరుగైన విద్య అందించడానికి పెద్ద ఎత్తున కార్యాచరణ చేపట్టింది. పాఠశాలల్లో అన్ని రకాల వసతులు కల్పించడానికి పూనుకుంది. అడ్మిషన్లు పెంచేందుకు ఉపాధ్యాయులతో బడి బాట కార్యక్రమం చేపట్టి వసతులపై తల్లిదండ్రులు, విద్యార్థులకు అవగాహన కల్పించి ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరే విధంగా చూస్తుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి పాఠశాల స్థాయిలోనే సాంకేతికతను జోడించి ఏఐ టెక్నాలజీతో విద్యా బోధన చేపట్టేందుకు ప్రత్యేక కార్యచరణ తీసుకుంది.
కలిసొచ్చిన కార్యక్రమాలు
ప్రభుత్వం పాఠశాలల్లో గత ప్రభుత్వం నిర్వహించిన మన ఊరు–మన బడి, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన అమ్మ ఆదర్శ పాఠఽశాలల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులు చేపట్టింది. తొలి విడతగా 149 పాఠశాలలను అభివృద్ధి చేయడగా ప్రస్తుతం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా 265 పాఠశాలల్లో రూ.12కోట్లతో సౌకర్యాలు కల్పించింది. ఇప్పటికే 230 పాఠశాలలకు పనులు పూర్తి చే శారు. గతంలో లేని విధంగా విద్యుత్, తాగునీరు, టాయిలెట్ తదితర సౌకర్యాలను కల్పించగా మిగతా పనులన్నీ పురోగతిలో ఉన్నాయి.
పుస్తకాలు, యూనిఫాంలు సిద్ధం
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవసరైన 1.49లక్ష పుస్తకాలకు గాను జిల్లా కేంద్రం నుంచి 1.45 లక్షల పాఠ్య పుస్తకాలు ఇప్పటికే పాఠశాలలకు చేరుకున్నాయి. అలాగే నోట్ బుక్స్, ఒక్కో జత యూనిఫాంలు సిద్ధమయ్యాయి. తొలిరోజే విద్యార్థులకు అదించనున్నారు.
తీరిన ఉపాధ్యాయుల కొరత
జిల్లాలో గతంతో తీవ్రంగా ఉన్న ఉపాధ్యాయుల కొ రత కొంత మేరకు తీరింది. మూడు,నాలుగేళ్లుగా మహదేవపూర్, పలిమెల, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో ఉపాధ్యాయుల కొరత వేధించింది. గ తేడాది ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, నూతన నియామకాలతో ఈ సమస్యల తీ రింది. జిల్లాలో ఇంకో 50 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఖాళీలను కూడా పాఠశాలలు పునఃప్రారంభం అయిన తర్వాత సర్దుబాటు చేయనున్నారు.
ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ..
కాళేశ్వరం: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయానికి రావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కొంతమంది ఉపాధ్యాయులు దూర ప్రాంతాల నుంచి అప్అండ్ డౌన్ చేస్తుండటంతో విద్యార్థులు నష్టపోతున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమవుతుండటంతో ఉన్నతాధికారులు వారానికి రెండుసార్లు పాఠశాలలపై శ్రద్ధ చూపితేనే పరిస్థితులు మారవని విద్యావంతులు పేర్కొంటున్నారు.
ప్రాథమిక పాఠశాలలు 317
ప్రాథమికోన్నత
పాఠశాలలు 44
ప్రాథమిక ఉన్నత
పాఠశాలలు 69
మొత్తం పాఠశాలలు 430
విద్యార్థులు 19,788
జిల్లాలో పాఠశాలల వివరాలు
అన్ని ఏర్పాట్లు పూర్తి..
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు నేటి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు అవసరమైన పాఠ్య, నోట్ పుస్తకాలు, జత యూనిఫాం సిద్ధం చేశాం. మొదటి రోజు వీటిని పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే బడిబాట ద్వారా ప్రవేశాల పెంపునకు కృషి జరుగుతోంది. మధ్యాహ్న భోజ నంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పరిశుభ్రమైన వాతావరణంలో వంటలు చేయాలని మధ్యాహ్న భోజన కార్మికులకు ఒక్కో రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించాం.
– రాజేందర్, ఇన్చార్జ్ డీఈఓ
పండుగ వాతావరణంలో పునఃప్రారంభించాలి:
కలెక్టర్ టీఎస్ దివాకర
పాఠశాలల పునఃప్రారంభం పండుగ వాతావరణంలో చేపట్టాలని కలెక్టర్ టీఎస్ దివాకర బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాఠశాలల ప్రారంభం రోజునే పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, వర్క్బుక్స్, యూనిఫాం అందించాలని, పాఠశాలను పండుగ వాతావరణంలో ప్రారంభించి విద్యార్థులను, తల్లిదండ్రులను ఆహ్వానించి వేడుకలా చేయాలన్నారు. విద్యార్థుల హాజరును మొదటి రోజు నుంచే నమోదు చేయాలన్నారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, బడిబాటను పకడ్బందీగా షెడ్యూల్ ప్రకారం నిర్వహించి, బడి బయటి పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలన్నారు. పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.

నేటినుంచి నూతన విద్యాసంవత్సరం ప్రారంభం

నేటినుంచి నూతన విద్యాసంవత్సరం ప్రారంభం

నేటినుంచి నూతన విద్యాసంవత్సరం ప్రారంభం

నేటినుంచి నూతన విద్యాసంవత్సరం ప్రారంభం