
అక్రమార్కులు ఎవరు?
సబ్ ఇంజనీర్ల రిక్రూట్మెంట్లో జరిగిన అక్రమాలకు బాధ్యులను గుర్తించడంలో టీజీ ఎన్పీడీసీఎల్ విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వ బడిలోనే చదివా..
మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట గ్రామం. అక్కడే ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి పదో తరగతి వరకు, వరంగల్లో ఇంటర్, డిగ్రీ, పీజీ వరకు ప్రభుత్వ కళాశాలల్లో చదివాను. నాన్న వ్యవసాయం చేసేవారు. నా విద్యాభ్యాసం మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లోనే పూర్తి చేశాను. ఆ రోజుల్లో చదువుతో పాటు ఆటపాటలకు ప్రాధాన్యం ఇచ్చే వారు. ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా తరగతి గదుల్లో బంధిస్తూ పుస్తకాలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలు ఇరుకు గదులు, అపార్ట్మెంట్లలో నిర్వహిస్తున్నారు. వేసవి సెలవుల తర్వాత మొదటి రోజు సంతోషంగా పాఠశాలకు వెళ్లి నూతన పుస్తకాలు తీసుకొని మురిసిపోయే వాళ్లం.
– సంపత్రావు, డీఎస్పీ, భూపాలపల్లి
●