
మేము ట్రాక్టర్లు నడపలేం..
కాటారం: ఆర్థిక భారం దృష్ట్యా గ్రామపంచాయతీల్లో వినియోగిస్తున్న ట్రాక్టర్లలో డీజిల్ నింపి నడిపే పరిస్థితిలో లేమని తెలియజేస్తూ మండలంలోని పంచాయతీ కార్యదర్శులు బుధవారం ఎంపీడీఓ బాబుకు ట్రాక్టర్ తాళాలను అప్పగించారు. రాష్ట్ర జేఏసీ కార్యచరణలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీఓకు వినతిపత్రం అందించారు. నిధుల కొరత ఉన్నందున ట్రాక్టర్ల నిర్వాహన భారం పడుతుందని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీలకు నిధుల కెటాయింపు లేకపోవడంతో అప్పులు తెచ్చి కాలం వెల్లదీయాల్సి వస్తుందన్నారు. ఆర్థికభారంతో తాము సతమతమవుతున్నామని, విధులు నిర్వర్తించడం కష్టతరంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల కార్యదర్శులు బీరెల్లి కరుణాకర్, రాజశేఖర్, సురేశ్, రవి, కృష్ణవేణి, ప్రసన్న, తదితరులు పాల్గొన్నారు.
ఎంపీడీఓకు జీపీ ట్రాక్టర్ల తాళాలు
అప్పగించిన పంచాయతీ కార్యదర్శులు