భూ సమస్యల పరిష్కారానికి సదస్సులు | - | Sakshi
Sakshi News home page

భూ సమస్యల పరిష్కారానికి సదస్సులు

Jun 11 2025 9:00 AM | Updated on Jun 11 2025 9:00 AM

భూ సమస్యల పరిష్కారానికి సదస్సులు

భూ సమస్యల పరిష్కారానికి సదస్సులు

అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌

కాటారం: భూ సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రభుత్వం భూభారతిలో భాగంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌ అన్నారు. మండలంలోని గారెపల్లిలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సును అదనపు కలెక్టర్‌ పరిశీలించారు. సమస్యలపై దరఖాస్తుల స్వీకరణ, ఆఫ్‌లైన్‌లో భాగంగా రిజిస్టర్‌లో దరఖాస్తుల వివరాల నమోదు, తదితర అంశాలపై ఆయన ఆరాతీశారు. ప్రతి దరఖాస్తును రిజిస్టర్‌లో ఖచ్చితంగా నమోదు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. దరఖాస్తుకు సంబంధించి క్షుణ్ణంగా చదివి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో సదస్సుల నిర్వహణ చేపట్టాలని పేర్కొన్నారు. కార్యాలయంలో ఇతర పనులు పెండింగ్‌ ఉండకుండా సిబ్బందిని కేటాయించాలని తెలిపారు. అదనపు కలెక్టర్‌ వెంట తహశీల్దార్‌ నాగరాజు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

రైతులు సద్వినియోగం

చేసుకోవాలి

రేగొండ: రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి సునీల్‌కుమార్‌ అన్నారు. మంగళవారం రేగొండ రైతు వేదికలో జిల్లా వ్యవసాయ అధికారి వీరునాయక్‌తో కలిసి రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా పండ్ల తోటలు పెట్టే రైతులకు, పందిరి సాగు ద్వారా కూరగాయలు పండించే రైతులకు, వివిధ ఉద్యాన యాంత్రీకరణ పరికరాలకు, తేనెటీగల పెంపకం చేపట్టే రైతులకు రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. అర్హులైన రైతులందరూ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పత్తి విత్తనాలు 60నుంచి 75 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాతనే విత్తుకోవాలన్నారు. రశీదులను పంటకాలం పూర్తయ్యే వరకు భద్రపరచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి వాసుదేవారెడ్డి, మండల విస్తరణ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement