● కలెక్టర్ సందీప్కుమార్ ఝా
జనగామ రూరల్: మహిళల భద్రతే ప్రధాన ధ్యేయమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా భద్రత, రక్షణ వారోత్సవాలు బుధవారం కలెక్టరెట్లోని కాన్ఫరెన్స్హాల్లో నిర్వహించారు. కాగా, మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి, అదనపు కలెక్టర్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించాలన్నారు. వివిధ శాఖలమహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.


