
మెడికవర్లో అరుదైన శస్త్రచికిత్స
కరీంనగర్టౌన్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ శ్రావణ్కుమార్ అనే యువకుడికి అరుదైన శస్త్రచికిత్స చేసినట్లు ఆసుపత్రి సర్జికల్ గ్యాస్ట్రో డాక్టర్ దిలీప్రెడ్డి, జనరల్ సర్జన్ డాక్టర్ వారిస్ ఉస్మాని(తాహా) తెలిపారు. ఆసుపత్రిలో మంగళవారం మాట్లాడుతూ.. శ్రీకరీంనగర్కు చెందిన శ్రావణ్కుమార్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్తే కన్నుపై దెబ్బ తగిలిందని కుట్లు వేశారు. కడుపులో తీవ్ర గాయమై, రక్తం లీక్ అవుతుందని తెలపడంతో పలు ఆస్పత్రులకు తీసుకెళ్తే తమతో కాదన్నారు. చివరకు ప్రాణాపాయస్థితిలో మెడికవర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. శ్రావణ్కుమార్కు సీటీస్కాన్ చేయడంతో కడుపులో బ్లంట్ ఇంజ్యూరీ అబ్డామెన్ (తీవ్ర రక్తస్రావం) అవుతున్నట్లు గుర్తించాం. బైక్ హ్యాండిల్ కడుపులో బలంగా గుచ్చుకోవడంతో రక్తస్రావంతో పాటు లివర్, ఫ్రాంకియాస్, స్ల్పీన్ దెబ్బతిన్నాయి. ఆపరేషన్ చేసి లివర్కు చికిత్స చేశాం. తప్పని పరిస్థితుల్లో ఫ్రాంకియాస్ కొంతభాగం, స్ల్పీన్ (ఫ్లీహం) మొత్తం తొలగించడం జరిగిందనిశ్రీ అని వెల్లడించారు. ప్రస్తుతం శ్రావణ్కుమార్ ఆరోగ్య పరిస్థితి బాగుందని తెలిపారు. మెడికవర్ సెంటర్హెడ్ గుర్రం కిరణ్, మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్ పాల్గొన్నారు.