విద్యుత్‌షాక్‌తో యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌షాక్‌తో యువకుడి మృతి

Jun 18 2025 3:45 AM | Updated on Jun 18 2025 3:45 AM

విద్యుత్‌షాక్‌తో   యువకుడి మృతి

విద్యుత్‌షాక్‌తో యువకుడి మృతి

జగిత్యాలక్రైం(సారంగాపూర్‌): సారంగాపూర్‌ మండలం పోతారంలో కొత్త ఇంట్లో వైరింగ్‌ చేస్తుండగా నారపాక బల్తగిరి (25) విద్యుత్‌షాక్‌ తగిలి మృతిచెందాడు. బీర్‌పూర్‌ మండలం ఇందిరనగర్‌కు చెందిన నారపాక బల్తగిరి ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం సారంగాపూర్‌ మండలం పోతారానికి చెందిన బైరి రమేశ్‌ ఇంట్లో విద్యుత్‌ వైరింగ్‌ చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న సారంగాపూర్‌ ఎస్సై సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

నిజాయితీ చాటుకున్న ఆటోడ్రైవర్‌

ధర్మపురి: తనకు దొరికిన తులం బంగారం చైన్‌ను పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు ఓ ఆటో డ్రైవర్‌. ధర్మపురికి చెందిన నూగూరి నగేష్‌ ఆటో డ్రైవర్‌. మంగళవారం స్థానిక బస్టాండ్‌ సమీపంలో అతడికి తులం బంగారు చైన్‌ దొరికింది. దానిని ధర్మపురి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్సై ఉదయ్‌కుమార్‌కు అందించాడు. అప్పటికే గొలుసు పోయిందని బాధితులు వెదుకుతుండగా వారిని విచారణ చేపట్టిన పోలీసులు వారికి అప్పగించారు. నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్‌ నగేష్‌ను శాలువాతో సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement