ఇరాన్కి అమెరికా అధ్యక్షుడు ఇచ్చిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. దీంతో పశ్చిమాసియా అంతటా ఉత్కంఠ, ఆందోళన నెలకొంది. ఇరాన్ని ఒక్క రాత్రిలో తుడిచిపెట్టేస్తామని ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. మరోవైపు ఇరాన్ కూడా ఏ మాత్రం లెక్కచేయట్లేదు. వెనక్కి తగ్గేదే లేదని వార్నింగ్స్ ఇస్తున్నారు. ఈ పరిణామాల వల్ల ఏం జరుగుతుందోనని పశ్చిమాసియాలోని ఇతర దేశాలు కూడా భయపడుతున్నాయి. ఈ క్రమంలోనే కువైట్ ప్రభుత్వం తమ దేశ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది.
పౌరులంతా బుధవారం ఉదయం 6 గంటల వరకు ఇళ్లలోనే ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని కువైట్ హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ క్షిపణి దాడులు జరిపే ప్రమాదం ఉండడంతోనే కువైట్.. తన పౌరులను హెచ్చరించింది.


