ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఫిర్యాదు

Oct 9 2025 8:04 AM | Updated on Oct 9 2025 8:04 AM

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఫిర్యాదు

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఫిర్యాదు

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఫిర్యాదు

పహాడీషరీఫ్‌: ముస్లింల ఆరాధ్య దైవం మహ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు సయ్యద్‌ ఖాజా పాషా కోరారు. ఈ మేరకు బుధవారం పహాడీషరీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాఘవేందర్‌ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కలిసి మెలసి ఉంటున్న ప్రజల నడుమ మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు రాజాసింగ్‌ యత్నిస్తున్నారన్నారు. ఇప్పటికీ ఎన్నో మార్లు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇన్‌స్పెక్టర్‌ను కలిసిన వారిలో పార్టీ నాయకులు అబ్దుల్‌ ఖదీర్‌, మహ్మద్‌ ఫెరోజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement