నకిలీ గేమింగ్‌ యాప్‌తో మోసం | - | Sakshi
Sakshi News home page

నకిలీ గేమింగ్‌ యాప్‌తో మోసం

Oct 9 2025 8:04 AM | Updated on Oct 9 2025 8:04 AM

నకిలీ గేమింగ్‌ యాప్‌తో మోసం

నకిలీ గేమింగ్‌ యాప్‌తో మోసం

ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: నకిలీ గేమింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌లతో అమాయకులను మోసం చేస్తున్న ఐదుగురు సైబర్‌ నిందితులను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసి, జ్యూడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. స్పెషల్‌ ఆపరేషన్‌ టీం (ఎస్‌ఓటీ) డీసీపీ శోభన్‌ కుమార్‌తో కలిసి సైబర్‌ క్రైమ్‌ డీసీపీ సాయి శ్రీ బుధవారం వివరాలు వెల్లడించారు. నవీన్‌కుమార్‌, సందీప్‌ కుమార్‌, పృథ్వీ రామరాజు, పవన్‌ వెంకట నాగభరద్వాజ్‌, రామాంజనేయులు ముఠాగా ఏర్పడి టెలిట్రాం, వాట్సాప్‌ గ్రూప్‌లలో డాడ్జ్‌ బుక్‌777 అనే నకిలీ గేమింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ను ఫ్లాట్‌ఫామ్‌లను నిర్వహించేవారు. బాధితులను నుంచే కాజేసే సొమ్మును నిర్వహించేందుకు అవసరమైన బ్యాంక్‌ ఖాతాల కోసం ఈ ముఠా నకిలీ పేర్లు, చిరునామా, ఆధార్‌ కార్డ్‌లతో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంక్‌లలో 120కు పైగా బ్యాంక్‌ అకౌంట్లను తెరిచారు. గేమింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌లలో నకిలీ లాభాలను చూపించి, బాధితుల నుంచి పెద్ద మొత్తంలో సొమ్మును వసూలు చేసేవారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, బ్యాంక్‌ లావాదేవీల ఆధారంగా ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వివిధ ఖాతాలలో ఉన్న రూ.14 లక్షల సొమ్ముతో పాటు రెండు ల్యాప్‌టాప్‌లు, 30 సెల్‌ఫోన్లు, చెక్‌ బుక్స్‌, ఏటీఎం కార్డ్‌లు, సిమ్‌కార్డ్‌లను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement