
వాక్వే పనులను వేగవంతం చేయాలి
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ బంజారాహిల్స్: కేబీఆర్ పార్క్లో వాక్వే పనులను వేగవంతం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కేబీఆర్ పార్క్ వాక్వే పనులను పరిశీలించారు. లైసెన్స్ తీసుకున్న పెట్ డాగ్స్ను మాత్రమే పార్క్లోకి తీసుకురావాలని కమిషనర్ ఆదేశించారు. కేబీఆర్ పార్క్ చుట్టూ హెచ్ సిటీ ద్వారా చేపట్టే ఫ్లైవర్లు, అండర్పాసులు కోర్టు ఆదేశాల మేరకు నిర్మిస్తున్నారా? అంటూ ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులను వివరణ అడిగారు. సెన్సిటివ్ జోన్ పరిధిలోనే పనులు చేపట్టినట్లు ప్రాజె క్టు ఇంజినీర్లు కమిషనర్కు వివరించారు. ఆయన వెంట అడిషనల్ కమిషనర్ సుభద్రా దేవి, డీసీ సమ్మయ్య, ప్రాజెక్టు ఎస్ఈ శ్రీలక్ష్మి, ఈఈ నాయక్, డిప్యూటీ ఈఈ హరీష్, సర్కిల్ ఈఈ విజయ కుమార్ తదితరులు పాల్గొన్నారు.