
డిజిటల్ డిస్ప్లేకు నో
స్టాండింగ్ కమిటీ తిరస్కారం
సాక్షి, సిటీబ్యూరో: దుకాణాలు, బ్యాంకులు తదితర సంస్థలకు ఎల్ఈడీ డిజిటల్ స్టాటిక్ బోర్టుల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ బ్రేక్ వేసింది. ఈ ప్రతిపాదనకు స్టాండింగ్ కమిటీ ఆమోదించలేదు. గతంలో తిరస్కరించిన చెరువుల పునరుద్ధరణకు నామినేషన్పై ‘నీరి’ని టెక్నికల్ కన్సల్టెంట్గా నియమించే ప్రతిపాదనను మళ్లీ పెండింగ్లో పెట్టింది. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశం వివిధ రహదారుల విస్తరణకు సిఫారస్ చేసింది. సమావేశంలో 9 అంశాలతో పాటు 2 టేబుల్ అంశాలకు ఆమోద ముద్ర వేసినట్లు మేయర్ తెలిపారు. అడిషనల్, జోనల్ కమిషనర్లు ఆయా విభాగాలకు సంబంధించిన టెండర్లు తదితర నిర్ణయాలన్నింటినీ స్టాండింగ్ కమిటీలో ఆమోదం పొందిన తర్వాతే చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆమోదం లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని సూచించారు. సమావేశంలో కమిషనర్ కర్ణన్, స్టాండింగ్ కమటీ సభ్యులు, ఆయా విభాగాల ఉన్నతాధకారులు పాల్గొన్నారు.