క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్ట్‌

May 2 2025 4:12 AM | Updated on May 2 2025 4:12 AM

క్రిక

క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్ట్‌

కవాడిగూడ: ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ పాల్పడుతున్న వ్యక్తులను సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌, దోమలగూడ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దోమలగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హిమాయత్‌నగర్‌ స్ట్రీట్‌ నెంబర్‌ 8 పవని లింగయ్య అపార్ట్‌మెంట్‌లో క్రికెట్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ పాల్పడుతున్న సమాచారం అందడంతో దాడి చేసిన పోలీసులు హిమాయత్‌నగర్‌కు చెందిన శ్రీరాజ్‌బూబ్‌, చిక్కడపల్లికి చెందిన సాయినాఽథ్‌, రేగళ్ల గోపీనాఽథ్‌లను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.1.2 లక్షల నగదు, మూడు సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

నడి రోడ్డుపై కారు దగ్ధం

హయుత్‌నగర్‌: రోడ్డుపై వెళుతున్న కారులో నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో దగ్ధమైన సంఘటన గురువారం హయత్‌నగర్‌ పోలీస్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. యాదాద్రి జిల్లా ఎలిమినేడు గ్రామానికి చెందిన వేణుగోపాల్‌రెడ్డి రేనాల్డ్‌ కై ్వట్‌ కారులో భార్యతో కలిసి నగరానికి వస్తున్నాడు. హయత్‌నగర్‌ అంబేడ్కర్‌ సర్కిల్‌ సమీపంలో కారు ఇంజిన్‌లో నుంచి మంటలు వచ్చాయి. అప్రమత్తమైన వేణుగోపాల్‌రెడ్డి అతడి భార్య కారు దిగారు. క్షణాల్లో మంటలు వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. ఫైర్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సీపీకి చెప్పి కేసు పెట్టిస్తా

మణికొండ: నా వాహనం నా ఇష్టం వచ్చినట్టు నడుపుతా.. అడగడానికి నీవెవరు... హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌(సీపీ)కు చెప్పి నీపై కేసు పెట్టిస్తా.. అంటూ ఓ ద్విచక్రవాహన దారుడు నార్సింగి ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న హోం గార్డుపై వీరంగం సృష్టించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నార్సింగి పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. గత నెల 29న నార్సింగి ట్రాఫిక్‌ హోంగార్డు రహమతుల్లా బండ్లగూడ చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్నాడు. అదే సమయంలో రిలయన్స్‌ స్మార్ట్‌ మాల్‌ పక్కనున్న కాలనీ నుంచి ఓ వ్యక్తి బైక్‌పై మెయిన్‌ రోడ్డు పైకి వచ్చాడు. అయితే ఆ సమయంలో ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండటంతో సైడ్‌ రూట్‌లో వెళ్లాలని హోంగార్డు అతడికి సూచించాడు. దీంతో ఆగ్రహానికి లోనైన అతను నేను ఎవరనుకుంటున్నావు.? నన్నే ఆపుతావా.? అంటూ హోంగార్డును బూతులు తిట్టాడు. అంతటితో ఆగకుండా హైదరాబాద్‌ సీపీకి చెప్పి నీపై కేసు పెట్టిస్తా.. అంటూ మొబైల్‌లో సీపీ నెంబర్‌ చూపి బెదిరించాడు. అతను వెళ్లగానే అతడి కుమారుడు వచ్చి మరో మారు హోంగార్డును అసభ్యంగా దూషించాడు. దీంతో హోంగార్డ్‌ రహమతుల్లా గురువారం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వాహనం నెంబర్‌ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు.

బైక్‌ ఢీకొని

గుర్తు తెలియని వ్యక్తి మృతి

కేపీహెచ్‌బీకాలనీ: ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిపై రోడ్డు దాటుతున్న ఓ గుర్తు తెలియని వ్యక్తిని వేగంగా దూసుకొచ్చిన ఓ ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలకు గురైన ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ మౌనికా రెడ్డి సమాచారం మేరకు... కేపీహెచ్‌బీ కాలనీ రోడ్లపై తిరుగాడే ఓ గుర్తు తెలియని వ్యక్తి బుధవారం అర్ధరాత్రి 12:40 గంటల సమయంలో ఫోరం మాల్‌ ఎదురుగా ఉన్న ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిపై రోడ్డు దాటుతుండగా హైటెక్‌ సిటీ నుంచి జేఎన్‌టియు వైపు వేగంగా దూసుకువచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో గుర్తు తెలియని వ్యక్తి తలకు తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందాడు. డయల్‌ 100 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి ద్విచక్ర వాహనదారుడు అనిల్‌ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు. గుర్తు తెలియని వ్యక్తి ఆచూకీ, ఇతర వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై

పోలీసులకు ఫిర్యాదు

హస్తినాపురం: ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తనను బెదిరిస్తున్నాడని అతనిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్‌ నాయకుడు గోపిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి గురువారం వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇటీవల హస్తినాపురం కార్పొరేటర్‌ సుజాతనాయక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఎల్‌బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ లో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైందని, సుజాతనాయక్‌కు తాను అండగా ఉంటున్నానని ఎమ్మెల్యే కోపంగా కోపంగా ఉన్నాడన్నారు. గురువారం తాను వనస్థలిపురంలో గ్రంథాలయసంస్థ భవన నిర్మాణ భూమిపూజ కార్యక్రమానికి హాజరుకాగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తన అనుచరులతో కలిసి దాడికి యత్నించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

నా ఇష్టం వచ్చినట్లు బైక్‌ నడుపుతా

అడగడానికి నీవెవరు

హోంగార్డుపై వాహనదారుడి వీరంగం

నార్సింగి పోలీసులకు ఫిర్యాదు

క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్ట్‌ 
1
1/2

క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్ట్‌

క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్ట్‌ 
2
2/2

క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement