భవనంపై నుంచి దూకి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

మావయ్య హైదరాబాద్‌ను విడిచి దూరంగా వెళ్తున్నాను..

Jun 10 2023 8:14 AM | Updated on Jun 10 2023 8:39 AM

సౌందర్య (ఫైల్‌) - Sakshi

సౌందర్య (ఫైల్‌)

హైదరాబాద్: మానసిక ఒత్తిడికి గురైన ఓ మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆరంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సౌందర్య (28) భర్త అభినవ్‌ కుటుంబ సభ్యులతో కలిసి కొండాపూర్‌లో నివాసముంటోంది.

గురువారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్లాల్సిన సమయంలో భర్త తండ్రి (మామ)కు ఫోన్‌ చేసి తాను హైదరాబాద్‌ను విడిచి దూరంగా వెళుతున్నానని చెప్పి ఫోన్‌ కట్‌ చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికి మళ్లీ ఫోన్‌ చేసి శంషాబాద్‌ పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఓ ఆరంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపింది.

దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆర్‌జీఐఏ పోలీసులకు సమాచారం అందించి అక్కడికి చేరుకున్నారు. అప్పటికే కిందకు దూకడంతో తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు, పోలీసులు ఆస్పత్రికి తరలించగా. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement