మద్యం మత్తులో వాహనాలను నడపడం వల్ల ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రజల ప్రాణాలను రక్షించేందుకే నగర వ్యాప్తంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నాం. దీనివల్ల వాహనదారులకు అవగాహన పెరగడంతోపాటు మద్యం తాగేవారు నియంత్రణలోకి వస్తారు. పెద్ద దిక్కుగా ఉండే యజమాని ప్రమాదంలో మృతి చెందితే ఆ కుటుంబానికి ఆధారం లేకుండాపోతుంది. అందుకే నగరంలోని అన్ని ప్రాంతాలోనూ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. దీంతో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.
టి.సత్యనారాయణ,
నగర ట్రాఫిక్ ఏసీపీ


