పథకాలు పటిష్టంగా అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

పథకాలు పటిష్టంగా అమలు చేయాలి

Jun 22 2025 7:17 AM | Updated on Jun 22 2025 7:17 AM

పథకాలు పటిష్టంగా అమలు చేయాలి

పథకాలు పటిష్టంగా అమలు చేయాలి

హన్మకొండ అర్బన్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అమలుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని దిశ కమిటీ చైర్‌పర్సన్‌, వరంగల్‌ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య అన్నారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు రైతులకు అందేలా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని, క్యాన్సర్‌ స్క్రీనింగ్‌, పీఎంఆర్‌ఎఫ్‌ ప్రయోజనాల అమలుపై దృష్టి సారించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. ‘బేటీ బచావో బేటీ పడావో’పై మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని, బాల్యవివాహాలు నివారించేలా గ్రామాల్ని తీర్చిదిద్దాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు సూచించారు. ఐసీడీఎస్‌ ద్వారా బరువు తక్కువగా ఉన్న పిల్లలకు పోషకాహారం అందించాలన్నారు. దిశ కమిటీ సమావేశానికి సంబంధించి వచ్చే విడతలో రైల్వే, దేవాదాయ, పర్యాటక, యూనివర్సిటీ అధికారులు కూడా పాల్గొనాలని ఎంపీ సూచించారు. అన్ని శాఖలు తమ తమ పథకాల అమలు వివరాలతో హాజరుకావాలన్నారు. అనంతరం స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహించాలని, పల్లె, బస్తీ దవాఖానల నిర్మాణంలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. డంపింగ్‌ యార్డు సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయం చూడాలన్నారు. శాసన మండలి వైస్‌ చైర్మన్‌ బండా ప్రకాశ్‌ మాట్లాడుతూ.. అంగన్‌వాడీ, వైద్యారోగ్యశాఖ సమన్వయంతో మంచి ఫలితాలు సాధించాలని, ఆశ వర్కర్ల ఖాళీల భర్తీకి జిల్లా స్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. గ్రేటర్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌ పాయ్‌ గ్రేటర్‌ అభివృద్ధి వివరాలు వెల్లడించారు. కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు సమగ్ర సమాచారంతో ఉండాలన్నారు. వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కమిటీ సభ్యులు బండ రామలీల, డీఆర్డీఓ పీడీ శ్రీను, డీఎంహెచ్‌ఓ అప్పయ్య ఇతర శాఖల అధిపతులు పాల్గొన్నారు.

జిల్లాను అగ్రభాగంలో నిలపాలి

‘దిశ’ సమావేశంలో ఎంపీ కడియం కావ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement