
వాగ్దానాలు నెరవేర్చాలి..
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
ఖిలా వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలి.. నిరుపేదలకు డబుల్బెడ్రూం ఇళ్లు కట్టించి ఇవ్వకుంటే సర్కారు మెడలు వంచుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. శనివా రం వరంగల్ ఉర్సుగుట్ట వద్ద పార్టీ జిల్లా కార్యాలయంలో కార్యదర్శి సీహెచ్.రంగయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ధంపై మాట్లాడుతూ.. అమెరికా అండతో ఇజ్రాయిల్ పాలస్తీనాను దురాక్రమణ చేయడానికి ప్రయత్నిస్తున్నదని అన్నారు. ఈ చర్య ను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నద ని చెప్పారు. సమావేశంలో నాయకులు జి.నాగయ్య, బాబు, రత్నమాల, ఈసంపెల్లి బాబు, భూక్య సమ్మయ్య, కుమారస్వామి, సాంబయ్య, శ్రీధర్, మధుకర్, ప్రశాంత్, వలదాసు దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.
క్వాలిటీ కంట్రోల్
ల్యాబ్ తనిఖీ
వరంగల్ అర్బన్: హనుమకొండ బాలసముద్రంలోని క్వాలిటీ కంట్రో ల్ ల్యాబ్ను గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశా రు. అనంతరం 31వ డివిజన్ గాయత్రి కాలనీలో నిర్మిస్తున్న రోడ్లను పరిశీలించారు. వరంగల్ కాశిబుగ్గ సర్కిల్ను తనిఖీ చేశారు. ఆయా విభాగాల ఫైళ్లను పరిశీలించి, ఉద్యోగులు, అధికారుల పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నా రు. పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.