ముఖదర్శనం తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

ముఖదర్శనం తప్పనిసరి

May 31 2026 1:24 AM | Updated on May 31 2026 1:24 AM

ముఖదర్శనం తప్పనిసరి విద్యార్థులకూ ముఖ ఆధారిత హాజరు అధ్యాపకులుగా పని చేస్తూ కళాశాలలకు సక్రమంగా హాజరు కాకపోవడం, కోర్సులో చేరి తరగతులకు హాజరవ్వకుండా పరీక్షలు రాసి సర్టిఫికెట్లు తీసుకుంటున్న విషయమై క్షేత్రస్థాయిలో విచారణ జరిపించిన ఉన్నత విద్యాశాఖ ఫేషియల్‌ అటెండెన్స్‌ను తప్పనిపరి చేసింది. ప్రభుత్వ కళాశాలల్లో ఫేషియల్‌ అటెండెన్స్‌ విధానం అమల్లో ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఏడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకులతో పాటు విద్యార్థులు ఫేషియల్‌ అటెండెన్స్‌ నమోదు చేస్తున్నారు. ఫేషియల్‌ అటెండెన్స్‌ ద్వారానే విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత కల్పిస్తున్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అమలు చేస్తున్న ఫేషియల్‌ అటెండెన్స్‌ విధానాన్ని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ, ఇంజినీరింగ్‌, పీజీ కళాశాలలకు వర్తింప చేస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ఆయా విద్యాసంస్థల్లోని అధ్యాపకులతో పాటు విద్యార్థులకు సైతం ఏఐ ఆధారిత ముఖ ఆధారిత హాజరు (ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ సిస్టం) ను తప్పనిసరి చేసింది. ఈ మేరకు తాజాగా ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌ నారాయణ భరత్‌ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ, పీజీ, బీఈడీ, ఇంజినీరింగ్‌ తదితర కళాశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం (2026–27) నుంచే దీనిని అమలు చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ప్రస్తుతం ఉపాధ్యాయులు, అధ్యాపకులు రోజుకు రెండుసార్లు ముఖ ఆధారిత హాజరు నమోదు చేస్తున్నారు. పాఠశాలకు వెళ్లగానే ఒకసారి, సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు మరోసారి హాజరు వేస్తున్నారు. ఇదే తరహాలో ప్రైవేటు బీటెక్‌, బీఈడీ, డిగ్రీ, పీజీ కళాశాలల్లో బోధనా సిబ్బందితో పాటు విద్యార్థులు రోజూ ఉదయం, సాయంత్రం రెండు సార్లు ముఖ హాజరు వేయాల్సి ఉంటుంది.

‘సత్తెనపల్లికి చెందిన సునీత గుంటూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉద్యోగం చేస్తూ, స్థానికంగా ఉన్న ఒక బీఈడీ కళాశాలలో చేరింది. రోజూ కళాశాలకు వెళ్లకుండా, రికార్డులు మరొకరితో రాయించి కళాశాలలో సబ్మిట్‌ చేస్తోంది. కేవలం పరీక్షలు రాసి సర్టిఫికెట్‌ పొందేలా ప్లాన్‌ చేసుకుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పొందేందుకు, తగిన హాజరు వేసే విధంగా కళాశాల యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకుంది.’ ఇటువంటి వారికి చెక్‌ పెట్టేలా విద్యాశాఖ ఫేషియల్‌ అటెండెన్స్‌ తీసుకురానుంది.

బోగస్‌ హాజరుకు చెక్‌

జిల్లాలోని కొన్ని ప్రైవేటు కళాశాల్లో విద్యార్థులు హాజరు కాకపోయినా హాజరైనట్లు చూపుతూ వారి నుంచి కొంత డబ్బు తీసుకుంటున్నారు. ముఖ ఆధారిత హాజరుతో ఇకపై వీరి ఆటలు సాగవు. అలాగే కొందరు ఇన్‌ సర్వీసు ఉపాధ్యాయులు బీఈడీ, బీపీఈడీ తదితర కోర్సుల పేరుతో స్టడీ లీవ్‌ పెట్టి ఇంటి దగ్గరే ఉంటున్నారు. ఉన్నత విద్యా సంస్థల్లో సైతం ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టం తీసుకురావడంతో ఇకపై ఇటువంటి వారు కాలేజీకి డుమ్మా కొట్టేందుకు అవకాశం లేదు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ముడి

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా బీటెక్‌, ఫార్మసీ, డిగ్రీ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వం నుంచి ఫీజులు పొందాలంటే ఖచ్ఛితంగా రెగ్యులర్‌గా కళాశాలకు వెళ్లాల్సిందే. నిబంధనల ప్రకారం 75 శాతం హాజరు ఉన్న విద్యార్థులకే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కల్పిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కన్వీనర్‌ కోటాలో ఇంజినీరింగ్‌, ఫార్మసీ, డిగ్రీ కోర్సులు చదువుతున్న విద్యార్థులు వచ్చే విద్యాసంవత్సరం నుంచి రెగ్యులర్‌గా కళాశాలకు వెళ్లడంతో పాటు ఫేషియల్‌ అటెండెన్స్‌ నమోదు చేయాల్సి ఉంది.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఇప్పటికే అమలు చేస్తున్న ఉన్నత విద్యాశాఖ ఉమ్మడి జిల్లాలో డిగ్రీ, ఇంజినీరింగ్‌, ఫార్మసీ, బీఈడీ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు హాజరు ఆధారంగానే ఫీజు రీయింబర్స్‌మెంట్‌

ప్రభుత్వ

కళాశాలల్లో అమల్లో

ఉంది

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకులతో పాటు విద్యార్థులకు ఫేషియల్‌ అటెండెన్స్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రైవేటు కళాశాలల్లోనూ దీనిని ప్రవేశపెట్టేందుకు ఉన్నత విద్యాశాఖ చర్యలు చేపట్టింది. తద్వారా విద్యావ్యవస్థలో జవాబుదారీ తనం పెరుగుతుంది.

– డాక్టర్‌ వీఆర్‌ జ్యోత్స్న కుమారి,

ప్రిన్సిపాల్‌, మహిళా కళాశాల, గుంటూరు

విద్యార్థులకూ ముఖ ఆధారిత హాజరు

గుంటూరు ఎడ్యుకేషన్‌: వేర్వేరు ఉద్యోగాలు చేస్తూ, ఖాళీ సమయంలో కళాశాలకు వెళ్లకుండా ఉండడం, ఇష్టమొచ్చినప్పుడు కళాశాలలో బోధన చేయడం, కళాశాల ముఖమే చూడకుండా కేవలం సర్టిఫికెట్ల కోసమే కోర్సులు పూర్తి చేస్తున్నవారు కోకొల్లలు. ఇటువంటి వారికి చెక్‌ పెడుతూ ఉన్నతవిద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రోజూ రెండుసార్లు ముఖ ఆధారిత హాజరు (ఫేషియల్‌ అటెండెన్స్‌) నమోదు చేసే విధంగా మార్గదర్శకాలు విడుదల చేసింది.

డిగ్రీ కళాశాలల్లో ఇప్పటికే అమలు

ప్రైవేటులోనూ అమలుకు రంగం సిద్ధం

Advertisement
 
Advertisement
Advertisement