టీడీపీ పాలనలో రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. విత్తనాలు, ఎరువుల కోసం నానా కష్టాలు పడి, అధిక ధరలకు కొనుగోలు చేసి పంట పండించాక దానిని అమ్ముకునేందుకు మళ్లీ రోడ్డెక్కాల్సిన దుస్థితి. వైఎస్ జగన్ పాలనలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని రకాలుగా సేవలు అందించడంతో పాటు కొనుగోలు కేంద్రాల ద్వారా పంటను మద్దతకు ధరకు కొనుగోలు చేయించారు. క్రాప్ ఇన్స్యూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతులు నష్టపోకుండా చూశారు. పంట కొనుగోలుకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడం దిగజారుడు తనానికి నిదర్శనం.
– వరికూటి అశోక్బాబు, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త
●


