ప్రత్తిపాడు నియోజకవర్గంలో 29వేల ఎకరాల్లో 16 లక్షల క్వింటాళ్ల మేరకు మొక్కజొన్న, జొన్న, శనగ పంటల దిగుబడి వచ్చింది. ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయకపోవడంతో తక్కువ ధరకు అమ్ముకోవడం వలన రైతులకు రూ.300 కోట్ల నష్టం వాటిల్లుతోంది. రెండేళ్లుగా క్రాప్ ఇన్స్యూరెన్స్ లేకపోవడంతో పాటు గతేడాది వర్షాల కారణంగా 20వేల ఎకరాల్లో పంట నష్టం జరిగితే రైతులకు పైసా ఇవ్వలేదు. గుంటూరు ఛానల్ పొడిగింపు టీడీపీ పాలనలో జరిగే పరిస్థితులు లేవు.
– బలసాని కిరణ్కుమార్, ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త


