మంగళగిరి టౌన్: మంగళగిరి ఎయిమ్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్న డాక్టర్ తుమ్మలగుంట ప్రత్యూషకు అరుదైన అవకాశం లభించింది. జర్మనీలోని మ్యూనిచ్లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక యూరోపియన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ మైక్రోబయాలజీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీసెస్ – (ఈఎస్సీఎంఐడీ) సదస్సులో భారతదేశం నుంచి ఏకై క ప్రతినిధిగా పాల్గొని కీలకోపన్యాసం చేశారు. మంగళగిరిలోని ఎయిమ్స్ జనరల్ మెడిసిన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్న డాక్టర్ ప్రత్యూష క్లినికల్ మైక్రోబయాలజీ, ఇన్ఫెక్షియస్ డిసీజెస్పైన పరిశోధనలు చేయడంతోపాటు ఆమె రచించిన విలువైన సిద్ధాంతపత్రాలు వివిధ జర్నల్స్లో ప్రచురితమయ్యాయి. జర్మనీలోని మ్యూనిచ్లో ఈ నెల 17నుంచి ప్రారంభమైన సదస్సు నేటితో ముగియనుంది. క్లినికల్ మైక్రోబయాలజీ, అంటువ్యాధులపై ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు భారత ప్రభుత్వం నుంచి ఆమె ప్రతినిధిగా పాల్గొని అంటువ్యాధులు ప్రబలకుండా వైద్యరంగం పరంగా చేపట్టాల్సిన పలు అంశాలపై ఆమె కీలకపన్యాసం చేశారు. ప్రతిష్ఠాత్మక సదస్సులో పాల్గొన్న డాక్టర్ ప్రత్యూషను ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ అహెంతం శాంతాసింగ్, అధికారులు అభినందించారు.


