పశ్చిమ డెల్టాకు 7,508 క్యూసెక్కులు విడుదల | - | Sakshi
Sakshi News home page

పశ్చిమ డెల్టాకు 7,508 క్యూసెక్కులు విడుదల

Aug 4 2025 3:37 AM | Updated on Aug 4 2025 3:37 AM

పశ్చి

పశ్చిమ డెల్టాకు 7,508 క్యూసెక్కులు విడుదల

దుగ్గిరాల: విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌ నుంచి 7,508 క్యూసెక్కులు ఆదివారం విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. బ్యారేజి వద్ద 12 అడుగులు నీటి మట్టం ఉంది. దుగ్గిరాల సబ్‌ డివిజన్‌ హైలెవెల్‌కి 316, బ్యాంక్‌ కెనాల్‌కు 1,791, తూర్పు కాలువకు 749, పశ్చిమ కాలువకు 281, నిజాపట్నం కాలువకు 487, కొమ్మూరు కాలువకు 2,980, బ్యారేజి నుంచి సముద్రంలోకి 77,750 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

6న జాబ్‌ మేళా

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 6న మంగళగిరిలోని వీటీజేఎం – ఐవీటీఆర్‌ డిగ్రీ కళాశాలలో జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కొండా సంజీవరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. టెన్త్‌, ఇంటర్‌, ఐటీఐ, డిగ్రీ, బీటెక్‌, డిప్లొమా, ఫార్మసీ, పీజీ విద్యార్హతలు కలిగిన 18 నుంచి 35 ఏళ్ల వయసు గల నిరుద్యోగ యువతీ, యువకులు మేళాకు రావచ్చన్నారు. రెస్యూమ్‌, విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్‌ కాపీలు, ఆధార్‌, పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలని తెలిపారు. వివరాలకు జి.వి.ఎస్‌. సాయి కుమార్‌– 80745 97926, షేక్‌ బాజీ – 77805 88993, పి.శ్రావణి – 93473 72996లను సంప్రదించాలని సూచించారు.

యజమానులకు

సెల్‌ఫోన్లు అప్పగింత

నగరంపాలెం: మొబైల్‌ ఫోన్లను జాగ్రత్తగా వాడాలని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ అన్నారు. రూ.50 లక్షల విలువైన 250 సెల్‌ఫోన్లను నగరంపాలెం జిల్లా పోలీస్‌ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్‌లో ఆదివారం యజమానులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటివరకు 3,115 ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు తిరిగి అందజేశామని అన్నారు. సెల్‌ఫోన్‌ పోయిన వెంటనే సీఈఐఆర్‌ వెబ్‌సైట్‌ ద్వారా లేదా 86888 31574 నంబర్‌కు, 1930 నేషనల్‌ సైబర్‌ క్రైం హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని చెప్పారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మొబైల్‌ఫోన్ల ద్వారా అధికంగా ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయని అన్నారు. ఈ క్రమంలో ఫోన్లను అజాగ్రత్తతో పోగొట్టుకోవద్దని సూచించారు. సైబర్‌ నేరాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఐటీ కోర్‌ సీఐ నిషార్‌బాషా, హెడ్‌ కానిస్టేబుల్‌ కిషోర్‌, కానిస్టేబుళ్లు శ్రీధర్‌, మానస, సీసీఎస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ రమేష్‌, కానిస్టేబుల్‌ కరీముల్లాను అభినందించారు.

దుర్గమ్మ సన్నిధిలో

భక్తుల రద్దీ

ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన భక్తుల రద్దీ మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగింది. శ్రావణ మాస శుభ ముహూర్తాల వేళ ఒక్కటైన నూతన వధూవరులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారుజామున ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమంలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి నిర్వహించే విశేష కుంకుమార్చనలోనూ ఉభయ దాతలు పాల్గొన్నారు. మధ్యాహ్నం అమ్మ వారికి మహా నివేదన నిమిత్తం అరగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేయడంతో రద్దీ మరింత పెరిగింది. మహానివేదన అనంతరం తిరిగి దర్శనాలు ప్రారంభం కాగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. భక్తులతో సర్వ దర్శనంతోపాటు రూ.100, రూ.300, రూ.500 క్యూలైన్లు కిటకిటలాడాయి. ఎండ వేడిమి, ఉక్కపోతతో క్యూలైన్‌లో భక్తులు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. అక్కడ కూలర్లు ఉన్నా వాటిని ఫ్యాన్లుగానే వినియోగించడంపై సిబ్బందిని భక్తులు ప్రశ్నించారు.

పశ్చిమ డెల్టాకు 7,508 క్యూసెక్కులు విడుదల 
1
1/2

పశ్చిమ డెల్టాకు 7,508 క్యూసెక్కులు విడుదల

పశ్చిమ డెల్టాకు 7,508 క్యూసెక్కులు విడుదల 
2
2/2

పశ్చిమ డెల్టాకు 7,508 క్యూసెక్కులు విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement