అద్దంకి రూరల్: వైద్యురాలి నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందిన ఘటనపై అధికారులు విచారణ జరిపారు. ఇటీవల అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో వైద్యురాలి నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందిన ఘటనపై మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం చీరాల ఆర్డీవో సరోజిని స్థానిక వైద్యశాలలో విచారణ చేపట్టారు. వైద్యురాలు, ఫిర్యాదుదారుల నుంచి, వైద్యశాల సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. ఈ నివేదికను కలెక్టర్కు అందజేయనున్నట్లు తెలిపారు. ఆర్డీవోతో విచారణకు వచ్చిన డీఎంహెచ్వో విజయలక్ష్మీకి ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు వైద్యురాలిపై ఫిర్యాదు చేస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో తహశీల్దార్ జీవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment