
రాత్రికి రాత్రికే స్టార్ డమ్ తెచ్చుకుంది ఓ యువతి. ఎలాంటి శిక్షణ లేకుండానే లయబద్ధంగా కాళ్లు కదుపుతూ నృత్యం చేసి అందర్నీ ఆశ్యర్యపరిచింది. సెలబ్రిటీల మన్ననలను అందుకుని ఒక్కసారిగా సోష్ల్ మీడియా స్టార్డమ్ హోదాను అందుకుంది. ఎవరామె అంటే..
చత్తీగఢ్లోని జగదల్పూర్కి లావణ్యదాస్ స్థానికి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడి కుమార్తె. ఈ 16 ఏళ్ల అమ్మాయి ఆశా భోంస్లే ఆజాకు పియా తు అబ్ పాట లయబద్ధంగా బెల్లీడ్యాన్స్ చేసింది. ఆ వీడియోని జూన్ 4న ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. అంతేఒక్కసారిగా ఆ వీడియో ఆమెకు ఎంతమంచి క్రేజ్ని తెచ్చిపెట్టిందంటే..సాక్షాత్రు బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రా..ఆమె నృత్య ప్రతిభకు ముగ్దురాలైంది.
ఆ జబల్పూర్ పట్టణంలోని సక్సెస్ కాన్వెంట్ స్కూల్లో పన్నెండో తరగతి చదువుతున్న లావణ్య తన వీడియో ప్రియాంక చోప్రాను ఆకర్షిస్తుందని అస్సలు అనుకోలేదు. ఏదో సరదాగా పోస్ట్ చేసిన వీడియో ఇంత మంచి ఫేమ్ తెచ్చిపెట్టినందుకు ఆనదంతో ఉబ్బితబ్బిబవ్వుతోంది. నిజానికి లావణ్య నటుల కుటుంబ నుంచి వచ్చిన నేపథ్యమే ఆమెది. బహుశా అదే ఆమెకు వారసత్వంగా వచ్చి.. ఇలా నృత్యకారిణిగా పేరుతెచ్చుకునేందుకు కారణమై ఉండొచ్చు.
ఆమె తల్లి నీలిమా దాస్ మాణిక్పూరి, హల్బీ మాండలికంపై మంచి పట్టు ఉన్న తాతాయ్య భాగీరథి దాస్ మహానంది ఇద్దరూ ధియేటర్ నటులు. ఇక లావణ్య కూడా వారి బాటలోనే పయనిస్తోంది. ఆమె ఇప్పటికే ఒడిస్సా, ఛత్తీస్గఢ్ సంగీత వీడియోలలో నటించింది. అలాగే దూరదర్శన్ కార్యక్రమాల్లో బాల కళాకారణి కూడా.
నిజానికి ఆమె నృత్యం లేదా నటనలో ఎటువంటి అధికారిక శిక్షణ పొందలేదు. ఆమె స్వయం శిక్షిత నృత్యకారిణి. అయితే ఆమె తల్లి నీలిమా శిక్షణ పొందిన కథక్ నృత్యకారిణి, పైగా ట్యూటర్గా పనిచేస్తున్నారామె. ప్రస్తుతం లావణ్య తన పన్నెండో తరగతి పరీక్షలు పూర్తి అయ్యిన వెంటనే ఢిల్లీ లేదా హైదరాబాద్ నగరంలో యాక్టింగ్ కోర్సులో చేరాలనుకుంటున్నట్లు పేర్కొంది. ఇక ఆమె తండ్రి 2019లో మరణానంతరం ఈ తల్లి కూతుళ్లిద్దరూ తమ కుటుంబ సంప్రదాయ కళను కొనసాగిస్తున్నారు.