దెందులూరు: ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తామని మోసం చేసిన కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు దెందులూరు ఎస్సై డి.వెంకట్ కుమార్ తెలిపారు. పెరుగుగూడెం గ్రామానికి చెందిన మోత్కూరి లక్ష్మణరావు కుమార్తెకు ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తానని చెప్పి ఏలూరుకు చెందిన మాగంటి లక్ష్మీ రత్న దుర్గ వాణి, మాగంటి అశోక్ కుమార్ రూ.1.20 కోట్లు తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. నకిలీ రసీదులు, అడ్మిషన్ పత్రాలు, లేఖలు, ఇతర డాక్యుమెంట్లు సృష్టించి ఫిర్యాదుదారున్ని మోసం చేశారన్నారు. పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ నిందితులు విచారణకు సహకరించకుండా తప్పించుకుంటూ వచ్చారన్నారు. అరెస్ట్ చేసిన నిందితులను ఏలూరు కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు.


